Home » Andhra Pradesh
పేదల పక్షపాతినని చెప్పుకొనే ముఖ్యమంత్రి జగన్ నిజస్వరూపం బయటపడింది. ఎన్నికలు పూర్తయినందున ప్రస్తుతం పేదల అవసరం లేదనుకున్నారేమో... వారిని పక్కనబెట్టి అస్మదీయులైన కాంట్రాక్టర్లకు మేళ్లు చేస్తున్నారు. ఎప్పుడో బటన్ నొక్కిన సంక్షేమ పథకాల లబ్ధిదారులందరికీ నగదు జమ చేయకుండా అరకొర
వైసీపీ అభ్యర్థుల్లో రోజురోజుకూ అభద్రతాభావం పెరిగిపోతోంది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు ముందు ఉన్న జోష్ వారిలో కనిపించడం లేదు. ఈ ఎన్నికల్లో గెలుస్తామా లేదా అనే గుబులు పట్టుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీ అభ్యర్థుల గెలుపుపై పందెం కాసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. పోలింగ్ శాతం పెరగడం... యువత ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొనడం వైసీపీ అభ్యర్థులను, శ్రేణులను నిరుత్సాహానికి గురిచేస్తోంది. ప్రభుత్వంపై ఉద్యోగవర్గాల్లో ఉన్న వ్యతిరేకత, అధికారంలో ఉన్నామనే దర్పంతో ఎమ్మెల్యేలు సాగించిన అక్రమాలు...
సర్వజన వైద్యశాలలో ఓపీ కౌంటర్ అత్యంత అసౌకర్యంగా మారింది. రోగులు, వారి బంధువులు గంటల తరబడి క్యూలో ఉండాల్సి వస్తోంది. ఓపీ, ఇనపేషెంట్ల అడ్మిషన కౌంటర్లు ఒకేచోట ఏర్పాటు చేయడం, మహిళలు, పురుషులకు కలిపి కౌంటర్లు ఉండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైద్యం కోసం వస్తే కొత్త రోగాలు సోకేలా ఉన్నాయని బాధితులు వాపోతున్నారు. జిల్లా ఆస్పత్రిలో ఓపీ చీటీలకు గతంలో మహిళలకు, పురుషులకు వేర్వేరు కౌంటర్లు ఉండేవి. అవి ఆస్పత్రి ప్రధాన ద్వారం వద్ద ఉండటంతో వైద్యులు, సిబ్బందికి, రోగులకు ఇబ్బందికరంగా ఉన్నాయని భావించారు. సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వరరావు, ఆర్ఎంఓలు, ఇంజినీరింగ్ అధికారులు చర్చించుకుని.. రోగుల విశ్రాంతి
రాష్ట్రంలో పోలింగ్ అనంతరం వైసీపీ రౌడీల దాడులను కంట్రోల్ చేయడంలో పోలీసులు విఫలం అవుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu naidu) వ్యాఖ్యానించారు. తాజాగా ఈ హింస ప్రశాంతమైన విశాఖకు కూడా చేరిందని అన్నారు. ఇలా అనేకం జరుగుతున్నా వైసీపీ(YCP) మూకలు చేస్తున్న దాడుల విషయంలో పోలీసులు(police) ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే ఏపీలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని చంద్రబాబు వెల్లడించారు.
రాష్ట్రంలో అధికార మార్పిడి తథ్యమని అధికారులందరికీ తెలిసిపోయిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య(Varla Ramaiah) వ్యాఖ్యానించారు. అందుకోసమే కార్యాలయాల్లోని రికార్డులు తరలించడానికి సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో కార్యాలయాల్లోని రికార్డులు తరలించడానికి, మార్చడానికి వీల్లేదని ఆర్డర్ ఇవ్వాలని గవర్నర్ను కోరినట్లు వర్ల రామయ్య తెలిపారు.
రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్కు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కీలక లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వ ఈ -ఆఫీస్ అప్ గ్రేడ్ వ్యవహారాన్ని నిలిపివేయాలని కోరారు. ఈ నెల 17 నుంచి 25 వరకు అప్గ్రేడ్ పేరుతో ఈ-ఆఫీస్ మూసివేతపై చంద్రబాబు అనుమానాలు వ్యక్తం చేశారు. మరికొద్ది రోజుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్న తరుణంలో ఇప్పటికిప్పుడు ఈ-ఆఫీస్ అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం లేదని చంద్రబాబు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ముగియడంతో ముఖ్య పార్టీల నేతలు రిలాక్స్ అవుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మహారాష్ట్ర పర్యటనలో ఉన్నారు. మహారాష్ట్రలో గల కొల్హాపూర్ మహాలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని సతీ సమేతంగా సందర్శించారు. ఆలయంలో చంద్రబాబు, భువనేశ్వరి ప్రత్యేక పూజలు చేశారు.
Andhrapradesh: పల్నాడు హింసపై నిజాల్ని సమాధి చేసే కుట్ర జరుగుతోందని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ నిజనిర్దారణ కమిటీని మాచర్ల ఎందుకు వెళ్లనివ్వలేదని ప్రశ్నించారు. పల్నాడు హింసకు కారణాల్లో పోలీసుల తీరుపైనే ఎన్నో అనుమానాలు ఉన్నాయన్నారు. డీజీపీ, ఎస్పీలు మారినా కిందిస్థాయి ఖాకీల్లో వైసీపీ వీరవిధేయులు ఉన్నారన్నారు.
Andhrapradesh: ఏపీ ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తొలిసారి స్పందించారు. ‘‘ఏపీలో వచ్చే ఫలితాలను చూసి దేశం మొత్తం ఆంధ్రావైపే చూస్తుంది. గతంలో 151 అనేదే చాలా పెద్ద నెంబర్.. 22 ఎంపీ స్ధానాలు కూడా చాలా పెద్ద సంఖ్యే.. ఈసారి 151 కంటే ఎక్కువ స్ధానాలు, 22 ఎంపీ స్ధానాలు కంటే ఎక్కువ సాధిస్తాం’’ అని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు.
Andhrapradesh: శ్రీశైలంలో పెను ప్రమాదం తప్పింది. శ్రీశైలం శిఖరేశ్వరం సమీపంలో బొలేరో వాహనం అదుపుతప్పి లోయలో పడింది. అయితే లోయలో పడి చెట్టుకు ఢీ కొట్టి వాహనం ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. ప్రమాద సమయంలో బొలేరో వాహనంలో 15 మంది ప్రయాణిస్తున్నారు.