Home » PM Modi
తాము అధికారంలోకి వస్తే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) తీసేస్తామన్న విపక్ష ‘ఇండీ’ కూటమిపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. ఆ చట్టాన్ని ఎవరూ తీసివేయలేరని, ఏం చేస్తారో చేసుకోండని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. గురువారం ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల్లో పలు చోట్ల ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ప్రసంగించారు.
రాష్ట్ర ప్రజలు కేసీఆర్ను ఓడించేందుకు గత్యంతరం లేని పరిస్థితిలోనే కాంగ్రె్సను గెలిపించారని మాజీ మంత్రి, మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నా రు. రాష్ట్రంలో అతి తక్కువ కాలంలోనే చీ కొట్టించుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, అలవి కాని హామీలిచ్చి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. గురువారం నల్లగొండలో ఆయన మీడియాతో మాట్లాడారు.
Telangana: రైతుల కోసం బీఆర్ఎస్ ధర్నాలు చేయడం సిగ్గు చేటని కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. గత పదేళ్లల్లో రైతులకు ఏం చేశారని ప్రశ్నించారు. రైతులకు సంకెళ్లు వేసింది బీఆర్ఎస్ కాదా అని నిలదీశారు. గజ దొంగల్లా బేడీలు వేశారని.. నేరెళ్ల ఘటన ఎవరి హయాంలో జరిగిందని అన్నారు. రైతులను బీఆర్ఎస్ ప్రభుత్వం గోసపుచ్చుకుందని.. దాన్ని ఎవరు మర్చిపోలేదన్నారు.
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో ఒకవైపు అల్లర్లు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 400 సీట్లతో కేంద్రంలో తిరిగి అధికారం చేపట్టిన తర్వాత పీవోకేని తిరిగి భారత్లో కలుపుతామని ప్రకటించారు. పశ్చిమ బెంగాల్లోని సిరాంపూర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ.. 370 అధికరణం రద్దు తర్వాతే జమ్ము కశ్మీర్లో శాంతి పవనాలు వీస్తున్నాయని, స్వేచ్ఛా నినాదాలు ప్రతిధ్వనిస్తున్నాయని తెలిపారు.
ఉత్తరప్రదేశ్లో బీజేపీ బలమైన పార్టీగా ఉన్నప్పటికీ 2019లో ఆ పార్టీ సాధించిన ఫలితాలు పునరావృతం కావని ప్రతిపక్ష శిబిరంలో ఉన్న పలువురు నేతలు, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి ప్రతిగా బీజేపీ నేతలు మాత్రం.. రామమందిరం నిర్మాణం, డబుల్ ఇంజిన్ సర్కార్ హయాంలో జరిగిన నిర్మాణాత్మక కార్యక్రమాలతో గతంలో కంటే ఎక్కువ ఫలితాలు సాధిస్తామని ఆశాభావంతో ఉన్నారు. 2014లో యూపీలో బీజేపీ 71 సీట్లు సాఽధించగా, 2019లో 62 సీట్లు గెల్చుకుంది.
‘హిందూ-ముస్లిం’ రాజకీయాలు చేయకూడదని తాను సంకల్పం తీసుకున్నానని ప్రధాని మోదీ అన్నారు. అలా విడదీసి రాజకీయాలు చేసిన రోజున ప్రజాజీవితంలో కొనసాగేందుకు తాను అర్హుడినే కాదని స్పష్టం చేశారు. 2002లో గోద్రా ఘటన తర్వాత తన ప్రతిష్ఠను కావాలనే దెబ్బతీశారని విపక్షాలను విమర్శించారు. ‘ఆంగ్ల వార్తాచానల్ సీఎన్ఎన్-న్యూ్స18’కు ఆయన ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. తన ఎన్నికల ప్రసంగాల్లో తానెప్పుడూ ముస్లింలను చొరబాటుదారులని అనలేదన్నారు. ఎక్కువ మంది పిల్లలను కలిగిఉన్నది ముస్లింలేనని కూడా అనలేదని తెలిపారు.
ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని.. ఎన్డీఏ కూటమి గెలుస్తుందని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి (Kishan Reddy) ధీమా వ్యక్తం చేశారు.ఏపీలో అల్లర్లపై కేంద్ర ఎన్నికల కమిషన్, ఏపీ పోలీసులు కఠినంగా వ్యవహరించాలని హెచ్చరించారు.
Andhrapradesh: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ నాయకత్వానికి, ఉత్తర్ప్రదేశ్ అటవీశాఖ మంత్రి అరుణ్ కుమార్ సక్సేనాకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలియజేశారు. ‘‘దేశంలో అత్యంత పవిత్ర పుణ్య క్షేత్రం, శైవ క్షేత్రమైన వారణాశిలో నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి నన్ను ఆహ్వానించినందుకు నా కృతజ్ఞతలు’’ అని అన్నారు.
ఇటీవల రాజస్థాన్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్పై విమర్శలు గుప్పిస్తూ.. ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ‘చొరబాటుదారులు’, ‘ఎక్కువమంది పిల్లలున్న వారు’..
హిందువులు అత్యంత పవిత్రంగా భావించే గంగా సప్తమి పర్వదినాన.. ప్రధాని మోదీ వారాణసీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి నామినేషన్ వేశారు. అమిత్షా, రాజ్నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ సహా పలువురు ఎన్డీయే కూటమి నేతలు తదితర అతిరథమహారథులు వెంటరాగా..