Home » TOP NEWS
పోలీసుల అనుమతి లేనప్పటికీ వందలాది మంది నిరసనకారులు సిల్చార్ పట్టణంలోని బెరెంగా ప్రాంతంలో రోడ్లపైకి వచ్చి ఆందోళనలకు దిగారు. రోడ్లు దిగ్బంధం చేయడంతో పోలీసులు వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. నల్లజెండాలు ధరించిన నిరసనకారులు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కోడికత్తి శ్రీనుకు న్యాయం జరగాలని రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. టెర్రరిస్టులపై పెట్టే కేసులు అతనిపై పెట్టారని మండిపడ్డారు. అధికారం ఉపయోగించి పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ఉపయోగించారని ఆగ్రహించారు.
ఎప్పుడు పడితే అప్పుడు జుట్టు కత్తిరించుకోవడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు. సాధారణంగా మంగళవారం నాడు మంగళివారు తమ కత్తికి పని చెప్పరు. అలాగే శుక్రవారం, పుట్టిన రోజు, అమావాస్య, పౌర్ణమి వంటి రోజుల్లో కటింగ్ చేయించవద్దని పెద్దలు చెబుతుంటారు.
వక్ఫ్ వ్యతిరేక ఆందోళనలతో ముర్షీదాబాద్ జిల్లాలో గత రెండ్రోజులుగా హింసాకాండ కొనసాగుతోంది. శుక్రవారం మైదలైన నిరసనల్లో ఆందోళనకారులు పోలీసు వాహనాలు సహా పలు వాహనాలకు నిప్పుపెట్టారు. దుకాణాలను లూటీ చేశారు. శనివారం కూడా పలుచోట్ల ఉద్రిక్తతలు కొనసాగాయి.
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పరిస్థితి అధ్వానంగా మారిందని, జాకీలు పెట్టి లేపినా లేచే పరిస్థితిలో లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. తెలంగాణలో ఎంత స్పీడ్గా ఆ పార్టీ గెలిచిందో అంతే స్పీడ్గా ఓడిపోయిందని ఎద్దేవా చేశారు.
ఈ ఘటనతో ప్రమేయమున్నట్టు భావిస్తున్న తొమ్మది మందిని ఇప్పటి వరకూ అరెస్టు చేసినట్టు గుణ పోలీస్ సూపరింటెండెంట్ సంజీవ్ కుమార్ షిండే తెలిపారు. ఘటనలో ప్రధాన నిందితుడు విక్కీ పఠాన్ను సైతం పోలీసులు అరెస్టు చేశారు.
థానే జిల్లా కల్యాణ్లో 12 ఏళ్ల మైనర్ బాలికను కిడ్నాప్ చేసి హత్యాచారానికి పాల్పడిన ఘటన అప్పట్లో సంచలనమైంది. కోల్సేవాడి ప్రాంతం నుంచి మాయమైన బాలిక ఆ తర్వాత బాప్గావ్ గ్రామంలో మృతదేహమై కనిపించింది. నిందితులకు కఠిన శిక్ష విధించాలంటూ డిమాండ్లు వెల్లువెత్తాయి.
మంత్రి పదవి తనకు రాకుండా కొంతమంది అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. ఈ విషయంలో మాజీ హోంమంత్రి జానారెడ్డి ధృతరాష్ట్రుడు పాత్ర పోషిస్తున్నారని ధ్వజమెత్తారు.
హైదరాబాద్లో ట్రాఫిక్ పోలీసులను చూసిన ద్విచక్ర వాహనదారుడు పారిపోయేందుకు యత్నించాడు. పోలీసులు అతని వెంటపడడంతో వేగం పెంచాడు.
హింసాత్మక ఘటనలతో బెంగాల్ తగులబడుతుంటే టీఎంసీ ఎంపీ యూసుఫ్ పఠాన్ 'కూల్ ఛాయ్' ఫోటోలు పోస్ట్ చేయడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.