love marriage: తన కంటే 12ఏళ్లు చిన్న వయసున్న యువకుడితో ప్రేమ వివాహం.. ఆమె తండ్రి మరణించిన నెల రోజులకు.. ఊహించని ఘటన..
ABN , First Publish Date - 2022-08-11T01:08:34+05:30 IST
ఆమెకు అప్పటికే వివాహమై ఓ కుమార్తె ఉంది. భర్త చనిపోవడంతో కూతురితో కలిసి ఒంటరిగా జీవిస్తోంది. ఈ క్రమంలో ఆమెకు తన కంటే 12ఏళ్లు చిన్న వయసున్న యువకుడు...
ఆమెకు అప్పటికే వివాహమై ఓ కుమార్తె ఉంది. భర్త చనిపోవడంతో కూతురితో కలిసి ఒంటరిగా జీవిస్తోంది. ఈ క్రమంలో ఆమెకు తన కంటే 12ఏళ్లు చిన్న వయసున్న యువకుడు పరిచయమయ్యాడు. కొన్నాళ్లకు ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. చివరకు ఇద్దరూ వివాహం (love marriage) చేసుకున్నారు. నాలుగేళ్లు ఆనందంగా జీవించారు. ఈ క్రమంలో మహిళ తండ్రి మరణించిన నెల రోజులకు ఊహించని ఘటన చోటు చేసుకుంది. మహిళ రెండో భర్త చేసిన నిర్వాకంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రం మీరట్ పరిధి శాస్ట్రి నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న హెడ్ కానిస్టేబుల్ రతన్ సింగ్ సిరోహి, కౌశల్ చౌదరి దంపతులకు స్నేహ అనే కుమార్తె ఉంది. స్నేహ భర్త ఐదేళ్ల క్రితం చనిపోయాడు. దీంతో ఆమెకు తన అత్తమామల తరపు నుంచి కోటి రూపాయల (Crore rupees Property) విలువైన ఇల్లు, భూమి వచ్చింది. ప్రస్తుతం స్నేహ.. తన కూతురు తమన్నాతో కలిసి అత్తగారి వద్దే ఉంటోంది. కోటి రూపాయల ఆస్తి మొత్తం కూతురి పేరు మీద బదిలీ చేశారు. ఇదిలావుండగా స్నేహ.. శాస్త్రినగర్లోని జిమ్కు వెళ్లే క్రమంలో 2017 అక్టోబర్లో, ఆమెకు తన కంటే 12ఏళ్ల చిన్న వయసున్న ఇషు అనే యువకుడు పరిచయమయ్యాడు.
అర్ధరాత్రి.. లైట్ల వెలుగుపడి రోడ్డు పక్కన కనిపించిందో ఆకారం.. అనుమానంతో బస్సును ఆపి ఆ డ్రైవర్ వెళ్లి చూస్తే..
కొన్నాళ్లకు ఆ పరిచయం ప్రేమగా మారింది. దీంతో ఇంట్లో వారిని ఒప్పించి 2018లో ఆ యువకుడిని పెళ్లి చేసుకుంది. పెళ్లయిన తర్వాత నుంచి యువకుడి కళ్లు ఆమె ఆస్తిపై పడ్డాయి. స్నేహ అత్తగారి పేరు మీద కూడా ఆస్తులు ఉండడంతో ఎలాగైనా కొట్టేయాలని ఆలోచించేవాడు. స్నేహ కూతురు తమన్నాను, ఆమె అత్తను చంపేస్తే.. ఆస్తి సొంతమవుతుందని కుట్రపన్నాడు. అంతకు ముందు అతడికి పలువురు నేరస్థులతో స్నేహం ఉండేది. దీంతో ఇదే విషయంపై వారితో చర్చించాడు. ఈ క్రమంలో స్నేహ తండ్రి 2022జూలై 7న మరణించాడు. దీంతో యువకుడికి అడ్డూఅదుపూ లేకుండా పోయింది.
extramarital affair: ప్రియుడిని రోజూ కలవాలనే ఉద్దేశంతో.. ఇంట్లో పిల్లలు చూస్తుండగా మహిళ చేసిన నిర్వాకం..
సరిగ్గా నెల రోజుల తర్వాత ఆగస్టు 7న వృద్ధురాలు, ఆమె మనువరాలి హత్యకు ప్లాన్ వేశారు. ఆ రోజు భార్యను వేరే ప్రాంతానికి తీసుకెళ్లాడు. పథకం ప్రకారం అతడి ముగ్గురు స్నేహితులు స్నేహ అత్తగారి ఇంటికి వెళ్లి.. వృద్ధురాలిని, ఆమె మనువరాలిని హత్య చేశారు. అనంతరం అల్మారాలో ఉంచిన రూ.22 లక్షలతో అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. చివరకు స్నేహ భర్త ఇషూతో పాటూ అతడి స్నేహితులైన రింకు, దీపక్, విశాంత్లను అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది.