extramarital affair: ప్రియుడిని రోజూ కలవాలనే ఉద్దేశంతో.. ఇంట్లో పిల్లలు చూస్తుండగా మహిళ చేసిన నిర్వాకం..
ABN , First Publish Date - 2022-08-10T02:46:37+05:30 IST
సంతోషంగా సాగుతున్న సంసారం.. దంపతులు చేసే తప్పుల కారణంగా చివరకు సమస్యలకు నిలయంగా మారుతుంటుంది. తప్పని తెలిసినా చాలా మంది తప్పు మీద తప్పులు చేస్తుంటారు..
సంతోషంగా సాగుతున్న సంసారం.. దంపతులు చేసే తప్పుల కారణంగా చివరకు సమస్యలకు నిలయంగా మారుతుంటుంది. తప్పని తెలిసినా చాలా మంది తప్పు మీద తప్పులు చేస్తుంటారు. చివరకు జీవితాలను నాశనం చేసుకోవడంతో పాటూ పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమను (Parental love) దూరం చేస్తుంటారు. ఉత్తరప్రదేశ్లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ మహిళ తప్పు చేయడమే కాకుండా చివరకు ఏ భార్యా చేయని విధంగా దారుణానికి పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రం మధుర పరిధిలోని ప్రాంతానికి చెందిన రామన్ (35).. భార్య రేఖ, ముగ్గురు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. రామన్.. ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీలో పని చేస్తున్నాడు. అప్పడప్పుడూ గ్రామానికి వచ్చి, భార్యాపిల్లల యోగక్షేమాలు చూసుకునేవాడు. ఇదిలావుండగా, ఇటీవల రేఖకు స్థానికంగా నివాసం ఉండే ఓ యువకుడు పరిచయమయ్యాడు. రోజూ ఇద్దరూ ఫోన్లలో చనువుగా (Phone talkings) మాట్లాడుకునేవారు. క్రమంగా వీరి మధ్య వివాహేర సంబంధం ఏర్పడింది. భర్త లేని సమయంలో యువకుడితో కలుస్తూ ఉండేది. ఒక్కోసారి పిల్లల ముందే ప్రియుడితో ఫోన్లలో మాట్లాడేది. దీనిపై ఆమె పెద్ద కుమార్తె ప్రశ్నించడంతో ఇటీవల కూతుర్ని అమ్మమ్మ ఇంటికి పంపించింది. ఇలావుండగా, ఇటీవల భార్య వివాహేతర సంబంధం భర్తకు తెలిసింది.
Suspicious Women: ఆటో కోసం వేచి చూస్తున్న మహిళ.. పోలీసులకు అనుమానం వచ్చి.. ఆమె సూట్కేస్ను తెరచి చూడగా..
దీంతో రోజూ భార్యతో గొడవ పడేవాడు. అయినా ఆమె మాత్రం ప్రియుడితో మాట్లాడుతూనే ఉండేది. ఆదివారం రాత్రి ఈ విషయమై దంపతుల మధ్య పెద్ద గొడవ జరిగింది. తర్వాత అంతా నిద్రపోయారు. అయితే ఎలాగైనా భర్త అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ఆదివారం రాత్రి భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. దీంతో ఒక్కసారిగా అతడు కేకలు పెట్టాడు. పిల్లలు లేచి చూసేసరికి మంటల్లో కాలిపోతున్నాడు. కేకలు విని చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని, అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. శరీరం దాదాపు 80% కాలిపోవడంతో (80 percent burning).. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. పోలీసులు అక్కడికి చేరుకుని విచారించారు. మృతుడి పిల్లలు, స్థానికుల వాంగ్మూలం మేరకు.. కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న రేఖ ప్రియుడి కోసం గాలిస్తున్నారు.