భర్త తాంత్రికుడు కావడంతో తలుపులు వేసి.. పూజలు చేస్తున్నాడేమో అనుకుంది.. అయితే ఉన్నట్టుండి యువతి గొంతు వినిపించడంతో..

ABN , First Publish Date - 2022-08-18T00:09:19+05:30 IST

ఆమె భర్త ఓ తాంత్రికుడు. వివిధ రకాల సమస్యలతో అతడి వద్దకు రోజూ చాలా మంది వస్తుంటారు. వారితో డబ్బులు తీసుకుని, ఏవేవో పూజలు చేస్తూ పంపిస్తుంటాడు. ఆదాయం..

భర్త తాంత్రికుడు కావడంతో తలుపులు వేసి.. పూజలు చేస్తున్నాడేమో అనుకుంది.. అయితే ఉన్నట్టుండి యువతి గొంతు వినిపించడంతో..

ఆమె భర్త ఓ తాంత్రికుడు. వివిధ రకాల సమస్యలతో అతడి వద్దకు రోజూ చాలా మంది వస్తుంటారు. వారితో డబ్బులు తీసుకుని, ఏవేవో పూజలు చేస్తూ పంపిస్తుంటాడు. ఆదాయం వస్తుండడంతో అతడి భార్య కూడా అడ్డుచెప్పలేదు. అయితే ఓ రోజు భార్య ఇంటికి వచ్చేసరికి.. భర్త గది తలుపులు వేసుకున్నాడు. దీంతో లోపల పూజలు చేస్తున్నాడేమో అని భార్య అనుకుంది. అయితే కాసేపటికి లోపలి నుంచి యువతి గొంతు వినిపించడంతో అనుమానం వచ్చింది. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని, తలుపులు బద్దలు కొట్టి చూడగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. 


మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh) రాష్ట్రం షాజాపూర్ జిల్లా (Shahjapur district ) బరోడియా ప్రాంతానికి చెందిన  జితేంద్ర అనే వ్యక్తి భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. జితేంద్ర స్థానికంగా తాంత్రిక పూజలు చేస్తుంటాడు. ఈ విషయం ఆనోటా, ఈనోటా పడి చుట్టు పక్కల ప్రాంతాల్లో అందరికీ తెలిసింది. దీంతో చాలా మంది బాధితులు.. వివిధ సమస్యలతో అతడి వద్దకు వస్తుంటారు. వారితో కొంత డబ్బులు తీసుకుంటూ, పూజలు చేసి పంపిస్తుంటాడు. అలాగే పలు గ్రామాలకు వెళ్లి.. భగవత్ కథలు కూడా చెప్తుంటాడు. ఈ క్రమంలో అతడికి చాలా మంది యువతులు (young women) , మహిళలతో కూడా పరిచయం ఏర్పడింది.

ఇంట్లోనే శవాన్ని పూడ్చేశాడు.. ఫోన్‌ను కంటైనర్‌పై పడేశాడు.. అన్నీ దృశ్యం సినిమాలో చూపించినట్టే చేశాడు కానీ..


ఇటీవల గుణ జిల్లాకు చెందిన ఓ యువతితో ఏర్పడిన పరిచయం... చివరకు ప్రేమగా మారింది. భార్యకు తెలీకుండా ఆమెతో కలుస్తూ ఉండేవాడు. ఇటీవల ఓ రోజు భార్య పని మీద బయటికి వెళ్లడంతో.. ప్రియురాలిని ఏకంగా ఇంటికే తీసుకొచ్చాడు. గది తలుపులు మూసేసి, లోపల పూజలు చేస్తున్నట్లు నటిస్తూ.. ప్రియురాలితో రాసలీలలు మొదలెట్టాడు. ఇంటికి వచ్చిన భార్యకు గది తలుపులు మూసి ఉండడంతో... లోపల భర్త పూజలు చేస్తున్నాడేమో అనుకుంది.

husband ఇంట్లో లేడని తెలుసుకుని లోపలికి వెళ్లిన యువకుడు.. చివరకు అటుగా వెళ్తున్న స్థానికులకు అనుమానం రావడంతో..


అయితే కాసేపటికి లోపలి నుంచి యువతి గొంతు వినిపించడంతో అనుమానం వచ్చింది. ఎంత పిలిచినా భర్త తలుపులు తీయకపోవడంతో పోలీసులకు ఫోన్ చేసింది. అక్కడికి చేరుకున్న పోలీసులు.. తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. లోపల ప్రియురాలితో ఉన్న భర్తను చూసిన భార్యకు కోపం కట్టలు తెంచుకుంది. అందరిముందే భర్త ప్రియురాలిని కొట్టుకుంటూ బయటికి ఈడ్చుకొచ్చింది. దీంతో పోలీసులు కలుగజేసుకుని తాంత్రికుడు, అతడి ప్రియురాలిని స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇన్నాళ్లూ.. తమ కూతురు కాలుజారి కాలువలో పడిందనుకున్నారు.. కానీ ఇంట్లో పరుపు శుభ్రం చేస్తుండగా.. బయటపడిన పేపర్‌తో..



Updated Date - 2022-08-18T00:09:19+05:30 IST