Home » Telangana » Rangareddy
తెలంగాణ రాష్ట్రంలోని పేదలందరికీ నాణ్యమైన విద్యనందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలిపారు. ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో ఖాలీగా ఉన్న అడ్మిషన్ల పోస్టర్ను ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఆవిష్కరించారు.
స్వామి వివేకానందుడిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం తెలిపారు. వివేకానంద జయంతి సందర్భంగా ఆదివారం చేవెళ్ల పట్టణ కేంద్రంలో ఆయన విగ్రహానికి కాంగ్రెస్, బీజేపీ నాయకులు నివాళులర్పించారు.
మండల పరిధిలోని కాకునూర్ గ్రామ శివారులోని పెద్దవాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను ఆదివారం కేశంపేట పోలీసులు సీజ్ చేశారు.
ఆక్రమంగా తరలిస్తున్న రేషన్ బియాన్ని ఘట్కేసర్ పోలీసులు స్వాధీనం చేసుకొని ఇద్దరిపై కేసునమోదు చేశారు.
పాముకాటుతో ఓ వృద్ధురాలు మృతిచెందింది. ఈ ఘటన ఘట్కేసర్ పోలీ్సస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
మండల కేంద్రంలో ఒకే రోజు మూడుచోట్ల చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలోని వైన్షా్పలోని గల్లలో ఉన్న చిల్లర రూ.500 నగదుతో పాటు రెండు క్వార్టర్బాటిళ్లు, ఒక బీరును దొంగిలించారు.
ఉమ్మడి జిలాలో భూగర్భజలాలు గణనీయంగా పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. వానాకాలం ( ఖరీఫ్) సీజన్లో విస్తారంగా వర్షాలు కురిసినప్పటికీ యాసంగి (రబీ) సీజన్లో అంతంత మాత్రంగానే వర్షాలు పడడంతో భూగర్భజలాలు పెరగలేదు. మరోవైపు నీటి వినియోగం పెరగడంతో శరవేగంగా భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. నవంబర్ నెలాఖరు నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు భూగర్భజలాల పరిస్థితి పరిశీలిస్తే ఒక్క నెలలోనే సగటున మీటర్ లోతుకు భూగర్భజలాలు పడిపోయాయి.
రానున్న ఉగాది నుంచి పౌర సరఫరాల దుకాణాలలో సన్నబియ్యం ఇవ్వటానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శనివారం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, సంక్షేమ పథకాల అమలుపై ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అవగాహన సదస్సును రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో నిర్వహించారు.
ఈనెల 26 నుంచి ప్రభుత్వం రైతుభరోసా పథకం అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటోందని, గ్రామాలు, పట్టణాల్లో మౌలిక వసతులను కల్పించేందుకు ఎన్ని నిధులైనా కేటాయించేందుకు సిద్ధంగా ఉందని ప్రభుత్వ చీఫ్విప్ పట్నం మహేందర్రెడ్డి అన్నారు. శనివారం ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో రూ.2.20కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
వికారాబాద్ మునిసిపాలిటీ దీనస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. జిల్లా కేంద్రం.. బల్దియాలో కనీసం కార్మికులకు జీతాలు కూడా ఇవ్వని పరిస్థితి. చెక్కుల రూపంలో ట్రెజరీకి పంపిన జీతాలు ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు. సాధారణ నిధుల నుంచి నేరుగా కార్మికులకు ప్రతీనెల అందించే అధికారులు.. ఈనెల మాత్రం ట్రెజరీకి చెక్కులు పంపించి చేతులు దులుపుకున్నారు.