Home » Telangana » Rangareddy
సంవత్సర కాలంగా పంచాయతీ ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నాయకులకు.. త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన ప్రకటనతో గ్రామాల్లోని వివిధ పార్టీల నాయకుల ఆశలకు జీవం పోసినట్లయింది. 2024 జనవరి 31న సర్పంచుల పదవీకాలం ముగియడంతో అప్పటి నుంచి ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది.
పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్నగర్లోని క్యాంపు కార్యాలయంలో గురువారం జిల్లేడు చౌదరిగూడ మండలానికి చెందిన 63 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందించారు.
వాహనాలు డ్రైవ్ చేసేవారు ట్రాఫిక్ రూల్స్ను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని, రూల్స్ తప్పక పాటించాలని చేవెళ్ల ట్రాఫిక్ సీఐ వెంకటేశం తెలిపారు. రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై చేవెళ్ల మండలంలోని ఆయా కంపెనీల వద్ద గురువారం డ్రైవర్లకు అవగాహన కల్పించారు.
శంకర్పల్లిలోని మద్యం దుకాణంలో దొంగలుపడ్డారు. రూ.30వేల నగదు, రూ.10వేల విలువ గల మద్యాన్ని ఎత్తుకెళ్లారు. శంకర్పల్లి సీఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం శంకర్పల్లి పట్టణంలోని సింగాపురం గేటు వద్ద వెస్టు సైడ్ అనే పేరుతో రఘునందన్రెడ్డి అనే వ్యక్తి మద్యం దుకాణాన్ని నడుపుతున్నాడు.
నడుస్తున్న రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందినట్లు రైల్వే హెడ్కానిస్టేబుల్ మల్లేశ్వర్ తెలిపారు. బుధవారం అర్ధరాత్రి మహబూబ్నగర్ నుంచి ఉందానగర్ వైపు వెళ్తున్న గుర్తుతెలియని రైలు నుంచి జారి పడినట్లు తెలిపారు.
వేవ్పూల్లో ఆడుతుండగా ప్రమాదవశాత్తు ఓ బాలుడు మృతిచెందాడు. నగరంలోని శాలిబండకు చెందిన రఫియా, గులాం రసూల్ అన్సారీల కుమారుడు ఫైజన్ అన్సారీ(11) జాన్హుమాలోని మదీనా మిషన్ హైస్కూల్లో 6వ తరగతి చదువుతున్నాడు.
వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు జిల్లాలోని పలు ఆలయాలు ముస్తాబయ్యాయి
పట్టణంలోని చెక్పోస్టు వద్ద ఆదివారం బైక్పై వెళ్తున్న బుల్లబ్బాయి, లావణ్యతో పాటు వారి కూతురు హర్షిత మృతిచెందిన ఘటన విధితమే.
పేకాట స్థావరంపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. మండ పరిధిలోని పేకాట స్థావరాలపై బుధవారం రాత్రి టాస్క్ఫోర్స్ సీఐ ఆంజనేయులు ఆధ్వర్యంలో ఎస్ఐ అరుణ్కుమార్గౌడ్, ప్రొబిషనరీ ఎస్ఐ శ్వేత సిబ్బందితో వెళ్లి దాడులు నిర్వహించారు.
పేయింటర్ అదృశ్యమైన ఘటన ఘట్కేసర్ పోలీ్సస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.