హైదరాబాద్లో చెరువుల పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న హైడ్రా మరో భారీ ఆపరేషన్ను చేపట్టింది. మాదాపూర్ హైటెక్స్ సమీపంలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో రూ.2200 కోట్ల విలువైన భూమిని స్వాధీనం చేసుకుంది.
కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎంత నష్టం జరిగిందో.. అంచనా కోసం కమిటీకి బాధ్యతలు అప్పగించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కమిటీ నివేదిక అందిన తర్వాతే కాళేశ్వరంపై ఆలోచిస్తామని చెప్పారు.
గత పాలకులు అహంకారం ఎక్కువై ఓడిపోయారంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలపై కవిత విమర్శలు సంధించారు. కేసీఆర్ హయాంలో అసెంబ్లీ ముందు ఉద్యమకారుడు ఆత్మాహుతి చేసుకుని చనిపోయాడన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని సైతం ఉద్యమకారులు బంగ్లా నుంచి బయటకు గుంజుతారని జోస్యం చెప్పారు.
హైదరాబాద్ మహానగరంలో నిత్యం ఏదో ఒక మోసం జరుగుతూనే ఉంటుంది. తాజాగా మరో మోసం వెలుగులోకి వచ్చింది. దాదాపు రూ.75కోట్ల మోసం బహిర్గతమైంది.
గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం కింద రూ.387 కోట్లని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మొదటి విడతగా ఇప్పటికే రూ. 259.36 కోట్లు విడుదలైన విషయం తెలిసిందే.
కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడితో ముఖ్యమంత్రి రేవంత్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నాలుగు కొత్త ఎయిర్పోర్టుల అభివృద్ధి, తదితర అంశాలపై చర్చించారు.
హైదరాబాద్ పాతబస్తీలో రౌడీషీటర్ల ఆగడాలు మితిమీరుతున్నాయి. తాజాగా కాలాపత్తర్ ప్రాంతంలో రౌడీషీటర్ అసద్, అతని గ్యాంగ్ చేసిన దాడి స్థానికంగా తీవ్ర భయాందోళనలు సృష్టించింది.
మెట్రో రెండో దశ డిటైల్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)పై ప్రతిష్టంభన నెలకొంది. తమ వద్దకు సరైన డీపీఆర్ ఇప్పటివరకు రాలేదని కేంద్ర ప్రభుత్వం చెబుతుండగా.. తాము ఏడాది క్రితమే అన్ని అంశాలతో సమగ్రంగా పంపించామని, కేంద్రం అడుగుతున్న వివరాలను తెలియజేస్తున్నామని హైదరాబాద్ ఎయిర్పోర్టు మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఏఎంఎల్) వర్గాలు పేర్కొంటున్నాయి.
శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు పెరిగిపోతున్నాయి. తాజాగా మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. గల్ఫ్ ఎయిర్లైన్స్ విమానానికి బెదిరింపు మెయిల్ వచ్చింది. వెంటనే ఎయిర్పోర్టు అధికారులు అప్రమత్తం అయ్యారు.
సమస్యల మీద స్పష్టత.. పరిష్కారాలపై అవగాహన.. పక్కా ప్రణాళిక.. హడావిడి నిర్ణయాలకు బదులు దీర్ఘకాల ప్రయోజనాల మీద ఫోకస్. అందుబాటులో ఉన్న సాంకేతికత సాయంతో ప్రజలకు మెరుగైన జీవనాన్ని అందించాలన్నదే తన ధ్యేయం అంటున్నారు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) తొలి కమిషనర్ జి. సృజన.