హైదరాబాద్లోని బోలక్పూర్ ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. స్థానికంగా ఉన్న ఓ స్క్రాప్ దుకాణంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సాయి భగీరథ్ ఎట్టకేలకు పోలీసుల ఎదుట లొంగిపోయారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ తన కుమారుడు భగీరథ్ను అడ్వకేట్ల సమక్షంలో పోలీసులకు అప్పగించారు.
తెలంగాణ రాష్ట్రంలో జూన్ 25 నుంచి SIR ప్రక్రియ మొదలవుతుందని సీఈవో సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఇంటింటికీ వెళ్లి బీఎల్వో(BLO)లు ప్రత్యేక సర్వే చేస్తారని అన్నారు.
ఇరాన్ - ఇజ్రాయిల్ యుద్ధాన్ని సాకుగా చూపి పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచడం సామాన్యుల నడ్డి విరచడమే అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఆత్మనిర్భర్ కేవలం ఓట్లు రాల్చే నినాదమే తప్ప.. ఫలితాలు తెచ్చిన పాలసీ కాదన్నది తేలిపోయిందని సీఎం అన్నారు.
మియాపూర్లో సీఏ విద్యార్థి జనార్దన్ అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు కీలక వివరాలు వెల్లడించారు. గదిలో రక్తపు మరకలు కనిపించడంతో కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ, దర్యాప్తులో ఇది ఆత్మహత్యేనని పోలీసులు నిర్ధారించారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. పోక్సో కేసులో భగీరథ్కు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది.
హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లి రైతుబజార్లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమాటా 33, వంకాయ రూ. 23లకు విక్రయిస్తున్నారు.
వేసవి ప్రణాళిక పనుల నిమిత్తం శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని మైలార్దేవుపల్లి సెక్షన్ అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు.
కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ తల్లి శకుంతల గుండెపోటుకు గురయ్యారు. హుటాహుటిన కుటుంబ సభ్యులు ఆమెను హైదరాబాద్కు తరలించారు.
మహిళలపైన నేరాలను తమ ప్రభుత్వం నియంత్రించిదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ కేసులో 8వ తేదీ రాత్రి బాలిక తల్లి పేట్ బషీరాబాద్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారని తెలిపారు.