అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధాన్ని ఆపేలా కేంద్రం చొరవ చూపాలని తెలంగాణ శాసన సభ తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభలో ప్రవేశపెట్టారు. మధ్యప్రాచ్యంలో యుద్ధం వల్ల దాదాపు 4 వేల మంది మరణించారని ఉపముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర జల్ శక్తి మంత్రి సి.ఆర్.పాటిల్ సోమవారం రాజ్యసభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. రూ. లక్షల కోట్ల ప్రజాధనం వృథాగా నీళ్లలో పోశారని ఆయన మండిపడ్డారు.
దేశంలో నియోజకవర్గాల పునర్విభజనపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఏదేదో మాట్లాడుతున్నారని, తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెడతామని అంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మరి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెట్టరా? అంటూ ప్రశ్నించారు.
ఓబీసీల్లో ముస్లింలను మూకుమ్మడిగా చేరుస్తున్నారని.. ఓబీసీలు వెనకబడడానికి కారణమవుతున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. రాజ్యసభలో ఓబీసీ రిజర్వేషన్ల అంశాన్ని విపక్షాలు అడ్డుకున్నాయని విమర్శించారు.
గోల్డ్ మ్యాన్ సూర్యాభాయ్ బండారాన్ని బయటపెట్టారు ఐటీ అధికారులు. అతడి ఒంటిపై ఉన్న బంగారం అంతా నకిలీదే అని తేల్చారు.
ఢిల్లీ వెళ్లినప్పుడు ఒంటిపై ఉన్న బంగారాన్ని చూసి ఐటీ అధికారులు సందేహంతో తనను విచారించారని తెలంగాణ గోల్డ్ మ్యాన్ కొండా విజయ్ కుమార్ వెల్లడించారు. సోమవారం హైదరాబాద్లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో కొండా విజయ్ కుమార్ మాట్లాడుతూ.. ఈ విచారణలో గోల్డ్ ఒరిజనలా? కాదా? అని తనిఖీ చేశారని చెప్పారు.
హైదరాబాద్ నగరంలోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసిన ఒక దారుణ ఘటన ఇప్పుడు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది. వివరాల్లోకి వెళితే..
తెలంగాణ శాసనమండలి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సస్పెండ్ చేశారు. అయినప్పటికీ బీఆర్ఎస్ సభ్యులు సభలోనే ఉండి నిరసనకు దిగారు.
జీవో 317ను వెంటనే రద్దు చేసి ఉద్యోగులకు సొంత జిల్లాల్లో పోస్టింగ్స్ ఇవ్వాలని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి కవిత బహిరంగ లేఖ రాశారు.
హైదరాబాద్లో 40 గ్రాముల కొకైన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ విక్రయిస్తున్న రైల్వేశాఖ ఉద్యోగిని అదుపులోకి తీసుకున్నారు.