Home » YS Jagan
ఏపీ సీఎం జగన్ కన్ఫ్యూజన్లో ఉన్నారా.. ఓటమి భయం ఆయనను వెంటాడుతుందా.. ఐదేళ్ళలో రాష్ట్రానికి ఏం చేశామో చెప్పుకునే పరిస్థితుల్లో లేరా.. ఏ ప్రశ్న వేసినా సూటిగా ఎందుకు సమాధనాం చెప్పలేకపోతున్నారు.. సరైన సమాధానం చెప్పడానికి ఎందుకు సంకోషిస్తున్నారు.. ప్రశ్నలు అడిగితే టెన్షన్ ఎందుకు పడుతున్నారు.. ఇప్పడు ఏపీ ప్రజల మదిలో మెదులుతున్న ప్రశ్నలు ఇవే..
ఆంధ్రప్రదేశ్ ప్రచార పర్వంలో పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల క్షణం తీరిక లేకుండా ఉన్నారు. గత ఎన్నికల సమయంలో జగన్ ఇచ్చిన హామీలు, ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. మద్య నిషేదం గురించి నవ సందేహాల పేరుతో మరో లేఖ రాశారు. సంపూర్ణ మద్యపాన నిషేధం ఎందుకు అమలు కాలేదని.. వివిధ బ్రాండ్ల పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి (MP Avinash Reddy) తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. మాజీ మంత్రి వైఎస్ వివేక(YS Vivekananda Reddy) హత్య కేసులో అవినాశ్ బెయిల్ని(Bail) రద్దు చేయాలని దాఖలు చేసిన పిటిషన్ని కోర్టు కొట్టేసింది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల దూసుకెళ్తున్నారు. తన సోదరుడు, సీఎం జగన్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. పెద్దముడియం మండలం సుద్ధపల్లి గ్రామం నుంచి ఈ రోజు ప్రచారం ప్రారంభించారు.
వ్యక్తిగత సమాచారానికి రాజ్యాంగబద్ధమైన రక్షణ ఉంది. ప్రభుత్వం కూడా దాన్ని తీసుకోవడానికి లేదు’’.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రధాన పార్టీల అధినేతలు క్షణం తీరిక లేకుండా ఉన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ లక్ష్యంగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. తనను కడప ఎంపీగా గెలిపిస్తే కేంద్రంలో మంత్రిని అవుతానని షర్మిల అన్నారు. ప్రత్యేక హోదా సాధిస్తానని స్పష్టం చేశారు. బద్వేలు నియోజకవర్గం పోరుమామిళ్ల మండలంలో జరిగిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడారు.
సొంత ఇలాకా... అందులోనూ సొంత పార్టీ నేతలు! చెప్పింది విని, జేజేలు కొట్టడంతప్ప... ఎదురు మాట్లాడిందీ, డిమాం డ్లు చేసిందీ లేనేలేదు.
Andhrapradesh: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతికి చేదు అనుభవం ఎదురైంది. స్వయంగా వైసీపీ నేతనే భారతిని నిలదీసిన పరిస్థితి. ఇదంతా జరిగింది కూడా సొంతగడ్డ పులివెందుల నియోజకవర్గంలోనే. పట్టాదారు పాసుపుస్తకాలపై సీఎం జగన్ పోటోకు సంబంధించి ఈ ఘటన చోటు చేసుకుంది.
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సొంత కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని తెలిసిన తర్వాత సీఎం వైఎస్ జగన్ కుటుంబంలో కీలక మార్పులు జరిగాయి. జగన్, షర్మిల కుటుంబాలు వేరైపోయాయి. వైఎస్ వివేకా హత్య వీరిద్దరినీ విడదీయలేదు కానీ జగన్ వైఖరే కారణమని మాత్రం తెలుస్తోంది. ఇప్పుడు షర్మిలకు అండగా వైఎస్ వివేకా కుటుంబంతో పాటు బ్రదర్ అనిల్ కుమార్ కూడా రంగంలోకి దిగారు.
ఆంధ్రప్రదేశ్లో వరుసగా రెండోసారి అధికారంలోకి రావడమే వైసీపీ లక్ష్యంగా పెట్టుకుంది. మేజిక్ ఫిగర్కు అవసరమైన సీట్లను సాధించడానికి రాజకీయ వ్యూహాలకు పదునుపెడుతోంది. వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువుగా ఉండటంతో వైసీపీ నేతలు ఒకింత ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర తర్వాత కూడా నియోజకవర్గాల్లోని పరిస్థితులు వైసీపీకి అనుకూలంగా లేవనే సంకేతాలు వెలువడటంతో ఇక చివరి అస్త్రాన్ని ప్రయోగించాలని వైసీపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.