Home » Yogi Adityanath
గతంలో మహాకుంభ్, కుంభ్మేళాలు 75 రోజుల పాటు నడిచేవని, ఇప్పుడు కుంభ్మేళాకు నిర్దేశించిన రోజులు తక్కువగా ఉన్నాయని అఖిలేష్ యాదవ్ అన్నారు.
Mahakumbh Mela 2025: మహా కుంభమేళాలో రేపు (ఫిబ్రవరి 12) మాఘ పూర్ణిమ రాజస్నానం. ఈ సందర్భంగా ప్రయాగ్రాజ్ చుట్టు పట్ల రెండు రోజుల ముందు నుంచే దాదాపు 300 కి.మీ. మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మౌని అమావాస్య సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనను దృష్టిలో ఉంచుకుని జనసమూహ నియంత్రణకు.. రేపటి నుంచి మహా కుంభమేళాలో ఈ సమయాల్లో నో వెహికల్ జోన్ రూల్ అమల్లోకి రానుంది.
Mahakumbh 2025 : ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో రేపే (ఫిబ్రవరి 12) మాఘ పూర్ణిమ రాజస్నానం. మౌని అమావాస్య సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనను దృష్టిలో ఉంచుకుని ఈ సారి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం. ఇందుకు చేయాల్సిన సన్నాహాలు, ట్రాఫిక్ నియంత్రణ మార్గదర్శకాలపై సీఎం యోగి ఆదిత్యనాథ్ సమావేశం ఏర్పాటు చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రయాగ్రాజ్లోని మహాకుంభ మేళాను సందర్శించారు. ప్రయాగ్రాజ్ చేరుకున్న తర్వాత మోదీ త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. అందుకు సంబంధించిన వీడియోను ఇక్కడ చూడవచ్చు.
Maha Kumbh Mela 2025 : ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం హాజరయ్యారు. భద్రతా సిబ్బంది మధ్య ఉదయం త్రివేణి సంగమానికి చేరుకుని పవిత్ర స్నానం ఆచరించారు.
ఏళ్ల తరువాత రామ్లల్లా ప్రతిష్ఠాపన జరిగినప్పుడు సమాజ్వాదీ పార్టీ వ్యతిరేకించిందని, అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి పేరు పెట్టడాన్ని వ్యతిరేకించిందని, గత రెండు నెలలుగా ఆ పార్టీ చీఫ్ మహాకుంభ్కు వ్యతిరేకంగా టీట్లు చేస్తూనే ఉన్నారని యోగి ఆదిత్యనాథ్ అన్నారు.
మహాకుంభ్ తొక్కిసలాటపై న్యాయవిచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
ఉత్తర్ ప్రదేశ్: బాగ్పత్లో ఘోర ప్రమాదం సంభవించింది. ఆదినాథుడి లడ్డూ వేడుకలో అపశృతి చోటు చేసుకుంది. లడ్డూ వేదిక కుప్పకూలడంతో ఐదుగురు భక్తులు మృతిచెందగా.. 50 మందికి పైగా తీవ్రగాయాలు అయ్యాయి.
మహాకుంభ్లో అన్నపానాదులు, బసకు ఎలాంటి కొరతా లేదని యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. సామరస్యం, కరుణ, అందరూ ఒక్కటేనన్న సందేశాన్ని మహాకుంభ్ ద్వారా ప్రపంచానికి చాటిచెప్పనున్నామని తెలిపారు.
ఢిల్లీ ఎన్నికల వేళ అధికార ఆప్, బీజేపీ పార్టీలు విమర్శలు, ప్రతివిమర్శలతో ప్రచారాన్ని హీటెక్కిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దేశ రాజధానిలో శాంతిభద్రతలను ప్రశ్నిస్తూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలు చేయడంతో ఆప్ ఛీఫ్ అరవింద్ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.