Home » Weather
ఏపీ ప్రజలు అలర్ట్ చేసే వార్తను విశాఖపట్నం వాతావరణ శాఖ చెప్పింది. నైరుతి బంగాళాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ తెలిపింది. భారీ గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 21న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించారు. 22 నుంచి ఏపీలో భారీ నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని తెలిపారు.
ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. ఏలూరు, కృష్ణా, ఎన్డీఆర్, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 17జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు సూచించారు. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్, జనగామ, నాగర్ కర్నూలు, జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాలలో ఎడతెరిపిలేని వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
వాతావరణంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా ఆంధ్రప్రదేశ్ లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
భాగ్యనగరంలో వర్షం దంచికొడుతోంది. వాన భారీగా పడుతోండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వర్షం ధాటికి పలు ప్రాంతాల్లో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. గ్రేటర్ హైదరాబాద్తో పాటు తెలంగాణలోని పలు జిల్లాలు వర్షంతో తడిసి ముద్దయిపోతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై వాయుగుండం ప్రభావం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే మూడు గంటల్లో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు.
భాగ్యనగరంలో వర్షం దంచికొడుతోంది. భారీగా వాన పడుతోండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానలు దంచికొడుతోండటంతో చెరువులు, వాగులకు వరద నీరు భారీగా చేరుకుంది. అయితే, యాదాద్రి జిల్లాలో ఉధృతంగా మూసీ ప్రవహిస్తోంది. జూలూరు - రుద్రవల్లి బ్రిడ్జిపై నుంచి మూసీ వరద ఉధృతి పొటెత్తింది.