Home » Videos
హైదరాబాద్ రాయదుర్గం భూముల వ్యవహారంలో ఎస్బీఐ తీరుపై తెలంగాణ ప్రభుత్వం అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. రాయదుర్గంలోని ఐదు ఎకరాల భూమి వేలాన్ని హైకోర్టులో ఎస్బీఐ సవాల్ చేయడంపై సర్కార్ అసహనాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ భారత ఆర్థిక, సాంకేతిక పురోగతిని ప్రపంచ వేదికపై ప్రస్తావించారు. మొబైల్ తయారీ రంగంలో భారత్ ప్రపంచంలో రెండో స్థానానికి చేరుకోవడం దేశ సామర్థ్యానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత విభేదాలపై మరోసారి చర్చ మొదలైంది. కొందరు మంత్రుల మధ్య సమన్వయం లోపించిందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
నగరంలో ఏసీబీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీగా అక్రమాస్తులు గుర్తించారు ఏసీబీ అధికారులు.
మంచిర్యాలలో పర్యటిస్తున్న టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత.. మావోయిస్టుల మనుగడపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘అడవిలో అన్నలు ఉంటే.. అప్పట్లో ఇక్కడ ధైర్యం ఉండేది. సింగరేణి అధికారులు పద్ధతిగా పని చేసేవారు. అడవిలో అన్నలు లేరని, అడిగే దిక్కులేదని సింగరేణి..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వివాదం వెనుక సీఎం రేవంత్ రెడ్డి హస్తం ఉందని వారు పేర్కొన్నారు.
మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి పెను సంచలనం రేగింది. తాజాగా జరిగిన కీలక సమావేశానికి ముగ్గురు ఎంపీలు దూరంగా ఉన్నారు. అది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
కర్నూలు జిల్లాలోని మంత్రాలయంలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. టీడీపీ ఇన్చార్జి రాఘవేంద్రరెడ్డి కార్యాలయం ఎదుట వైసీపీ మూకలు ఓవర్ యాక్షన్ చేశాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఎన్డీయే నేతలు అభినందనలతో ముంచెత్తారు. నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంది. సుదీర్ఘకాలం ప్రధానిగా కొనసాగిన రికార్డును నరేంద్ర మోదీ సొంతం చేసుకున్నారు.
భాగ్యనగరంలో భారీ వర్షం కురుస్తుండటంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. సిటీలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుండటంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి.