Home » TTD
‘తీర్థాల సన్నిధి యందు స్నానం సేయగనే పుణ్యములు పొంగునయా’ అని తిరుమల కొండల్లోని పుణ్య తీర్థాల గురించి తాళ్లపాక అన్నమా చార్యులు ఓ కీర్తనలో చెబుతారు. శేషాచలం అంతా తీర్థాల మయం. ఈ కొండల్లో 66కోట్ల పుణ్యతీర్థాలు ఉన్నాయని బ్రహ్మపురాణం, స్కంధ పురాణం వెల్లడిస్తాయి.
‘‘ఏడు కొండల సామి.. ఎక్కడున్నావయ్యా... ఎన్నీ మెట్లెక్కినా.. కానరావేమయ్యా.. ఈ అడవిదారిలో.. చేయూతనీయవా..’’ అంటూ శ్రీవేంకటేశ్వర మహత్యము సినిమాలోని పాట, తిరుమలకు చేరుకోవడం ఎంత కష్టమో వివరిస్తుంది. ఇప్పుడంటే ఎక్కడానికీ దిగడానికీ వేరువేరుగా సురక్షితమైన తారురోడ్లు ఉన్నాయి కానీ... ఒకప్పుడు దట్టమైన అడవిలో, క్రూరమృగాల నడుమ నుంచి, వాగులు వంకలు దాటి బండలు కొండలు ఎక్కి, లోయలు దాటి తిరుమలకు చేరుకోవాల్సి వచ్చేది.
హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి అంటే ఒక ముహూర్తం ఉండాలి. తాళి, తలంబ్రాలు ఉండాలి. మంగళమేళాలు హంగూ ఆర్భాటాలు తప్పనిసరి. తిరుమల శ్రీవేంకటేశ్వరుడి సన్నిధిలో మాత్రం వీటిలో దేనికీ ప్రాధాన్యం లేదు. ఇవేవీ లేకుండానే పెళ్లి జరిగిపోతుంది.
తిరుమల శ్రీనివాసుడిని దర్శించు కోవడమే ఒక దివ్యానుభూతి. ఎక్కడెక్కడి నుంచో కష్టాలకోర్చి తిరుమలకు చేరుకుంటారు. గంటలకు గంటలు క్యూల్లో వేచివుండి అయినా స్వామి దర్శనం చేసుకుంటారు. వసతుల్లేవని విసుక్కోరు. క్షణకాలం ఆయన మూల మూర్తిని దర్శించుకోగానే పడ్డ శ్రమంతా మరచి పోతారు.
లోకకల్యాణం కోసం సప్తగిరుల్లో వెలసిన అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీవేంకటేశ్వరస్వామికి సాక్షాత్తు బ్రహ్మ దేవుడే ఉత్సవాలను నిర్వహించాడట. బ్రహ్మ స్వయంగా నిర్వహించిన ఉత్సవాలు కావటంతోనే ‘బ్రహ్మోత్సవాలు’గా పేరు పొందాయని పురాణాల ద్వారా తెలుస్తోంది.
ప్రపంచంలో 197 దేశాలుంటే 157 దేశాల కరెన్సీ శ్రీవారి హుండీలో లభించింది. 2015 నుంచి 2025 మార్చి వరకు ఉన్న రికార్డుల ఆధారంగా చూస్తే రూ.201,65,97,829 విదేశీ కాయిన్స్, నోట్లు అందాయి.
తిరుమల శ్రీవారి ఆలయ పరకామణి కుంభకోణం మళ్లీ తెరపైకి వచ్చింది. లోక్అదాలత్లో రాజీ కుదిర్చిన కేసును సీబీసీఐడీకి అప్పగిస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలివ్వడంతో అప్పటి అధికారులు, పాలకుల గుండెల్లో గుబులు మొదలైంది.
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణలతో తిరుమల కొండ శోభాయమానంగా దర్శనమిస్తోంది.
గనులు, భూములు, అడవులు, సమస్త వనరులతోపాటు జనాన్ని కూడా జగన్ గ్యాంగ్ దోచుకున్నారని మంత్రి నారా లోకేష్ ఆరోపణలు చేశారు. చివరకు తిరుమల శ్రీవారి సొత్తునూ వదల్లేదని ధ్వజమెత్తారు.
వైసీపీ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భారీగా దోచుకున్నారని టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. స్వామి వారి హుండీని వైసీపీలోని కీలక నేతలు దోచుకున్నారని విమర్శించారు.