Home » TPCC
సంవిధాన్ హత్యా దివస్(Samvidhan Hatya Divas)గా జులై 25ను ప్రకటించడం చూస్తుంటే కాంగ్రెస్ను చూసి బీజేపీ ఏ విధంగా భయపడుతుంతో అర్థం చేసుకోవచ్చని TPCC సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్(TPCC Senior Vice President Niranjan) అన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానిగా మోడీ ఎన్నికైనా.. గెలుపు మాత్రం కాంగ్రెస్దే అన్నట్లు ప్రజలు అభిప్రాయపడుతున్నారని ఆయన చెప్పారు.
‘‘స్వాతంత్రోద్యమ కాలంలో దేశ ప్రజల కోసం జవహర్లాల్ నెహ్రూ 3,259 రోజుల పాటు జైలు జీవితాన్ని గడిపారు. అంటే తొమ్మిదిన్నరేళ్లు ఆయన జైల్లోనే ఉన్నారు. దేశ ప్రజల సమస్యలపై పోరాటం చేసి కొన్ని గంటలైనా జైలు జీవితం గడిపిన రికార్డు.. ప్రధాని మోదీకి ఉందా?’’
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ)కి కొత్త అధ్యక్షుడి నియామకం, మంత్రివర్గ విస్తరణపై అధిష్ఠానం కసరత్తు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ రెండు అంశాలపైశుక్రవారం సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీలతో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సుదీర్ఘంగా చర్చించారు.
టీపీసీసీ పదవిని మహిళకు ఇస్తే ఎలా ఉంటుంది? ఇదే ప్రశ్నను ఓ విలేకరి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వద్ద ప్రస్తావించగా.. సీఎం ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు నిరంజన్ తెలిపారు. నిజమైన ప్రజా సేవకుడికి అహంకారం ఉండదంటూ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు.. ప్రధాని మోదీని ఉద్దేశించి చేసినవేనని అంతా భావిస్తున్నారన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త సారధి నియామకానికి కసరత్తు జరుగుతోంది. లోక్సభ ఎన్నికలు ముగియడం, ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షునిగా ఉన్న రేవంత్ రెడ్డి పదవీ కాలం కొద్దిరోజుల్లో ముగియనుండడంతో టీపీసీసీ నూతన చీఫ్ నియామకంపై పార్టీ అధిష్ఠానం దృష్టి పెట్టింది.
ఇటీవల శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయంలో జరిగిన ఒక సెమినార్కు విచ్చేసిన కొందరు, ఆచార్యులు, పరిశోధక విద్యార్థులు ఎనిమిదేళ్లనాడు తుమ్మల నాగేశ్వర రావు ప్రచురించిన పురాణపండ శ్రీనివాస్ ‘పచ్చకర్పూరం’ గ్రంధంలో కొన్ని అంశాల్ని సభాముఖంగా ప్రస్తావించి.. ప్రశంసించడంతో... మరొకసారి ఈ పరమోత్తమమైన గ్రంధం హాట్ టాపిక్ అయ్యింది. ఈ విశేషాన్ని అప్పటికప్పుడు ప్రముఖ రచయిత పురాణపండకు ఫోన్లో ఒక ప్రొఫెసర్ తెలియపరిచగా... ‘తిరుమల రంగనాయకమంటపంలో వేదపండితుల మంత్ర ధ్వనుల మధ్య కప్పే శేష వస్త్రం’ ఎలాంటి అనిర్వచనీయ ఆనందానుభూతినిస్తుందో అదే అనుభూతి కలుగుతోందని పురాణపండ సంతోషం వ్యక్తం చేశారు.
తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ పూర్తైంది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఎక్కువ నియోజకవర్గాల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్య జరిగిందన్న ప్రచారం జరుగుతోంది. రెండు, మూడు స్థానాల్లోనే బీఆర్ఎస్ అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఓటింగ్ సరళి పరిశీలించిన తర్వాత ఆయా పార్టీలు తమకు వచ్చే సీట్లపై లెక్కలు వేసుకున్నాయి.
Telangana: కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసుకు సంబంధించి టీపీసీసీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. అమిత్ షా వీడియో మార్కింగ్ కేసులో ఢిల్లీ పోలీసుల వేధింపులపై కోర్టు దృష్టికి టీపీసీసీ తీసుకెళ్లింది. ఈ కేసుకు సంబంధించి కాంగ్రెస్ సోషల్ మీడియాకు చెందిన 29 మంది సెక్రటరీల నివాసాలకు ఢిల్లీ పోలీసులు వెళ్లారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు తాను ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘సీఎం పదవి అనేది గుంపు మేస్త్రి పాత్ర వంటిద’ని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎలా విమర్శలొచ్చాయో అందరికీ తెలుసు. ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తూనే ఉన్నారు. తాజాగా ఈ ట్రోల్స్కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.