Home » TPCC
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీవీకే పార్టీ ఘన విజయం సాధించింది. ప్రభుత్వం ఏర్పాటు కోసం ఆ పార్టీ అధినేత విజయ్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సందర్భగా ఆ రాష్ట్ర గవర్నర్ అనుసరిస్తున్న వైఖరిపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ స్పందించారు.
సీఎం రేవంత్ రెడ్డి కర్కోటకుడు, రాష్ట్రంలో హిట్లర్ పరిపాలన సాగుతుందంటూ టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నామని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు విత్ డ్రా చేసుకోవాలంటూ కవితను ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.
అధికారంలో ఉన్నామని.. పోలీసులను అడ్డు పెట్టుకొని ఎన్నికల్లో గెలవాలని చూడవద్దంటూ పార్టీ నేతలకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హితవు పలికారు. ఈ ఎన్నికల్లో టికెట్ల కోసం పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ను కలిసి ఇబ్బంది పెట్టొద్దని కేడర్కు సూచించారు.
మంత్రి కొండా సురేఖ, కాంగ్రెస్ వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మధ్య వివాదం ముదిరింది. మంత్రి, ఎమ్మెల్యే మధ్య భద్రకాళీ ఆలయ పాలకమండలి కమిటీ చిచ్చురేపింది.
టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నేడు హైదరాబాద్లో భేటీ కానుంది. మల్లు రవి అధ్యక్షతన హైదరాబాద్లో జరిగే ఈ సమావేశంలో ప్రధానంగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి అంశం చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అటు, కొండా మురళి..
బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం రాష్ట్రపతిని అపాయింట్మెంట్ అడిగాం.. కానీ ఇవ్వలేదని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్ల కల్పనలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
మంత్రి పదవి ఇస్తానంటేనే కాంగ్రెస్లోకి వచ్చా అని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. జూనియర్లకు మంత్రిపదవి ఇచ్చి తనను దూరం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ(మంగళవారం) ఆయన మీడియాతో మాట్లాడారు.
HCU Land: హెచ్సీయూ భూముల వివాదం నేపథ్యంలో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. ఆ క్రమంలో సోషల్ మీడియా వేదికగా పుకార్లు షికారు చేస్తున్నాయి. అలాగే పలు వీడియోలు సైతం ప్రజలను తప్పు పట్టే విధంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ మీడియా చైర్మన్ ఓ వీడియోను తన ఎక్స్ ఖాతా వేదికగా పోస్ట్ చేశారు.
TPCC: తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల బాధ్యురాలు మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ రానున్నారు. ఆ పదవిలో నియమితులైన తర్వాత ఆమె తొలిసారిగా హైదరాబాద్ వస్తున్నారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ కీలక నిర్ణయం తీసుకుంది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటెందన్నారు. ప్రస్తుతం సీఎం ఉండగా కొత్త సీఎం అనే ప్రస్తావన ఎందుకు వస్తుందన్నారు. అసలు మహేశ్వర్ రెడ్డికి కాంగ్రెస్ విషయాలు ఎలా తెలుస్తాయన్నారు. ఈ నెల 6 లేదా 7 వ తేదిన కుల గణనపై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని ..