Home » Tirupati
కొందరిలో ఎంత ఎదిగితే అంత అహంకారం పెరుగుతుందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తెలిపారు. ప్రపంచానికి భారత్ ఎంతో కొంత ఇవ్వాలని పేర్కొన్నారు. మనుషులందరికీ సౌఖ్యం, సదుపాయాలు కావాలని చెప్పారు.
ఎస్వీ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ గుగులోతు సర్దార్ నాయక్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. జూపార్క్ వద్ద కారులో ఆయన మృతదేహాన్ని గుర్తించారు.
ఇస్రో చరిత్రలోనే అతి భారీ ఉపగ్రహ ప్రయోగం గ్రాండ్ సక్సెస్ అయ్యింది. అమెరికాకు చెందిన భారీ కమ్యూనికేషన్ శాటిలైట్ బ్లూ బర్డ్ బ్లాక్-2ను LVM-3 M-6 రాకెట్ విజయవంతంగా నింగిలోకి తీసుకెళ్లింది.
‘తిరుమల తిరుపతి దేవస్థానం’ (టీటీడీ)లో 25 ఏళ్ల క్రితం మొదలైన ‘శ్రీవారి సేవ’... దేశ, విదేశాల నుంచి స్వామి దర్శనార్థం తిరుమలకు వచ్చే, లక్షలాది మంది భక్తులకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా... సరిగ్గా 25 ఏళ్ల క్రితం (2000) పురుడు పోసుకుంది.
నేలమీద వ్యవసాయం మనకు తెలుసు. నీటిమీద సాగు మనకు సరికొత్త వ్యవసాయ విధానం. అందునా సముద్రంలో సేద్యం.. ఎలా సాధ్యం అని ఆశ్చర్యం సహజం. ఇప్పుడా వ్యవసాయం మన తిరుపతి జిల్లాలోనే ప్రయోగాత్మకంగా మొదలైంది. అత్యంత విలువైన సముద్రపు నాచును బంగాళాఖాతంలో వాకాడు, తడ మండలాల్లోని మత్స్యకార మహిళలు పండిస్తున్నారు.
తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా మరో వివాదానికి వైసీపీ నేతలు శ్రీకారం చుట్టారు. తిరుమల అతిథి గృహంలో కోడిగుడ్లు, చికెన్ చూశా.. అని సామాజిక మాధ్యమాల్లో వైసీపీ నేత పోస్టు చేసిన వీడియో వైరల్గా మారింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
తిరుపతి, మచిలీపట్నం నుంచి నగరానికి రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్యరైల్వే అధికారులు తెలిపారు. ఈ రైళ్లు తిరుపతి నుంచి కాచిగూడకు, మచిలీపట్నం నుంచి ఉమ్డానగర్కు మధ్య నడుస్తాయని తెలిపారు.
టీటీడీ పాలకమండలి సమావేశం ముగిసింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
రోజా ఫస్ట్రేషన్లో మదమెక్కి మాట్లాడుతున్నారని టీడీపీ నేతలు వ్యాఖ్యలు చేశారు. రోజా ఇక జీవితంలో నగరిలో గెలవదని స్పష్టం చేశారు.
రానున్న రెండు మూడేళ్ల వ్యవధిలో రూ.1882.65 కోట్ల పెట్టుబడులతో ఫార్మా, ఎలకా్ట్రనిక్స్ పరిశ్రమలతో పాటు రెండు స్టార్ హోటళ్లు జిల్లాలో ఏర్పాటు కానున్నాయి. వీటి ద్వారా 3728 మందికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.