Home » terrorist
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఉగ్రవాద సానుభూతిపరులపై రాష్ట్ర పోలీసులను అప్రమత్తం చేయాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉగ్రకదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటుకు ఆదేశించారు.
దిల్సుఖ్నగర్ జంటపేలుళ్ల మాదిరిగా.. హైదరాబాద్, విజయనగరంలో వరుస పేలుళ్లకు భారీ కుట్ర జరిగింది. పేలుళ్లకు అవసరమైన ఐఈడీల తయారీకి అవసరమైన పరికరాలను సిద్ధం చేసుకున్నారు.
లష్కరే తొయిబా టాప్ కమాండర్ అబు సైఫుల్లాకు వినోద్ కుమార్, మొహమ్మద్ సలీమ్, ఖలీద్, వనియాల్, వాజిద్, సలీమ్ భాయ్ అనే మారుపేర్లు కూడా ఉన్నాయి. లష్కరే ఆపరేషన్లు, రిక్రూట్మెంట్ల నిర్వహణ, నిధుల సమీకరణ, సరిహద్దు చొరబాట్లలో సైఫుల్ కీలకంగా వ్యవహించే వాడు.
Africa Al Qaeda Terrorists: అల్ఖైదా అనుబంధ సంస్థకు చెందిన ఉగ్రవాదులు మూకుమ్మడిగా సైనిక స్థావరాలపై దాడులకు తెగబడ్డారు. ఏకంగా 200 మంది సైన్యాన్ని అతి దారుణంగా హతమార్చారు. ఇదేగాక ఉగ్రమూకలు ప్రజలను ఇళ్లు విడిచి వెళ్లిపోవాలంటూ బెదిరిస్తున్న ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
NIA: ముంబై ఎయిర్ పోర్టు దగ్గర ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. జకార్తా నుంచి ముంబై వచ్చిన అబ్దుల్లా ఫయాజ్ షేక్, తల్హా ఖాన్లు గత రెండేళ్లుగా పరారీలో ఉన్నారు. ఇప్పుడు జకార్తా నుంచి ముంబై వచ్చిన వారిని విమానాశ్రయంలో అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
జమ్మూ కశ్మీర్లోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో మొత్తం ఆరుగురు ఉగ్రవాదులను ఇండియన్ ఆర్మీ మట్టుబెట్టింది. నిఘా వర్గాల సమాచారంతో సెర్చ్ ఆపరేషన్ చేపట్టామని, 48 గంటల్లో ఆరుగురు ఉగ్రవాదుల్ని హతమార్చినట్లు ఫోర్స్ మేజర్ జనరల్ ధనంజయ్ జోషి తెలిపారు.
పెహల్గామ్ దాడి తర్వాత జమ్మూకశ్మీర్లో ఉగ్రవేట ముమ్మరంగా కొనసాగుతోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తీవ్రవాదులు దాక్కున్నట్టు సమాచారం అందుకున్న భారత సైన్యం పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో పలు ఎన్కౌంటర్లు కూడా జరుగుతున్నాయి.
Bangladesh Islamist Terrorists: బంగ్లాదేశ్కు చెందిన ఓ ఇస్లామిస్ట్ ఉగ్రవాది హిందువులపై నీఛమైన కామెంట్లు చేశాడు. మూత్రం, పేడ, తాబేళ్లు హిందువులకు ఇష్టమైన ఆహారం అంటూ అవమానకరంగా మాట్లాడాడు. చాలా దారుణంగా హిందువులపై కామెంట్లు చేశాడు.
Encounter In Jammu And Kashmir: మంగళవారం జరిగిన ఈ ఎన్కౌంటర్లో లష్కర్ ఈ తోయిబాకు చెందిన ఓ ఉగ్రవాది చనిపోయినట్లు తెలుస్తోంది. మరో ఇద్దరు ఉగ్రవాదుల్ని భద్రతా దళాలు చుట్టు ముట్టినట్లు సమాచారం.
PM Modi PoK Statement: అంతర్జాతీయ సమాజానికి, పాకిస్థాన్కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టమైన సందేశం ఇచ్చారు. భారత్ ఎట్టి పరిస్థితుల్లో సరిహద్దు వద్ద దాడులను సహించదని.. పాక్ ఆక్రమిత కశ్మీర్ అప్పగింతపై తప్ప మరో అంశంపై పొరుగు దేశంతో చర్చించబోమని తేల్చిచెప్పారు.