Home » terror attack
హవల్గాం ఉగ్రదాడిలో26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడంతో అధికారులు వైష్ణోమాత ఆలయానికి వెళ్లే మార్గంలో వెరిఫికేషన్ను మరితం తీవ్రం చేసారు. రిజిస్టర్డ్ సర్వీస్ ప్రొవైడర్లు ఆథరైజ్డ్ డాక్యుమెంట్లు అందుబాటులో ఉంచుకోవాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
Jammu Kashmir Bandipora Encounter: జమ్మూ కాశ్మీర్లోని బందీపొరాలో శుక్రవారం భద్రతాదళాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. మరో ఘటనలో పహల్గాం దాడికి కారణమైన ఇద్దరు ఉగ్రవాదులు వేసిన బంబ్ ట్రాంప్ నుంచి సైనికులు తృటిలో తప్పించుకున్నారు..
పాకిస్థాన్పై భారత్ విధించిన ఆంక్షలతో రాజస్థాన్కు చెందిన సైతాన్సింగ్ పెళ్లి ఆగిపోయింది. సరిహద్దులు మూసివేయడంతో పెళ్లి నిలిచిపోయిందని ఆయన వాపోయాడు
జమ్మూ కశ్మీర్లోని వ్యాపారులు పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ తమ ఆందోళనను వ్యక్తం చేశారు. దాల్సరస్సులో పడవలను వరుసగా పెట్టి, ప్లకార్డులతో తమ వ్యతిరేకతను ప్రకటించారు.
పహల్గామ ఉగ్రదాడి నేపథ్యంలో ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ కార్యాలయానికి కేక్ బాక్స్ తో ఒక వ్యక్తి చేరుకున్న వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. విలేకరులు చేసిన ప్రశ్నకు ఎలాంటి సమాధానం ఇవ్వకుండా ఆ వ్యక్తి ముందుకు సాగడం సడెన్గా అర్ధం కాకుండా ఉన్నది
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ను ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశంగా అమెరికా రక్షణ శాఖ మాజీ అధికారి మిచెల్ రూబెన్ విమర్శించారు. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్పై తీవ్ర వ్యాఖ్యలు చేసారు
పహల్గాంలో అమాయకుల ప్రాణాలు బలిగొన్న ఉగ్రవాదుల అంతం చూస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. ఉగ్రవాదులు, వారిని మద్దతు ఇచ్చే వారిని కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. ఈ ఉగ్రదాడిని భారత ఆత్మపై దాడిగా అభివర్ణించారు
పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద క్యాంపులను నాశనం చేయాలని అఖిలపక్షం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. పహల్గాంలో జరిగిన దాడికి సంబంధించి, భద్రతా వైఫల్యాలు కూడా ఉన్నాయని అఖిలపక్షం అంగీకరించింది
పహల్గాం ఉగ్రదాడి ఒక దారుణమైన ఘటనగా పేర్కొన్న కాంగ్రెస్, దీనిని ప్రజాస్వామ్యంపై నేరుగా దాడిగా భావించింది. భద్రతా వ్యతిరేకంగా నిఘా వైఫల్యాలపై సమగ్ర విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు
పహల్గాం ఉగ్రదాడిలో పర్యాటకుల మతం అడిగి పాశవికంగా కాల్చిన ఉగ్రవాదులకు తగిన శిక్ష విధించాలని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. ఉగ్రవాదులకు పాకిస్థాన్ మద్దతు ఉందని ఆరోపించిన ఆయన, కేంద్రం తీసుకునే శాంతి భద్రతా చర్యలకు మజ్లిస్ పార్టీ మద్దతు ఇస్తుందని తెలిపారు