Share News

Pahalgam Terror Attack: ఉగ్రదాడి.. అవే రక్తపు బట్టలతో అంత్యక్రియలకు కూతురు..

ABN , Publish Date - Apr 24 , 2025 | 02:51 PM

Pahalgam Terror Attack: జమ్మూకాశ్మీర్ పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో మొత్తం 26 మంది చనిపోయారు. వీరిలో మహారాష్ట్రలోని పూణెకు చెందిన సంతోష్ జగదాలె కూడా ఉన్నారు. గురువారం ఆయన అంత్యక్రియలు జరిగాయి. వేల మంది ఆ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

Pahalgam Terror Attack: ఉగ్రదాడి.. అవే రక్తపు బట్టలతో అంత్యక్రియలకు కూతురు..
Pahalgam Terror Attack

పహల్గామ్ ఉగ్రదాడిలో చనిపోయిన 26 మంది కుటుంబాలు శోక సంద్రంలో మునిగిపోయాయి. బరువెక్కిన గుండెలతో చివరి వీడ్కోలు పలుకుతున్నాయి. ఉగ్రమూకల కాల్పుల్లో మహారాష్ట్ర, పూణెకు చెందిన సంతోష్ జగదాలె అనే వ్యక్తి చనిపోయిన సంగతి తెలిసిందే. భార్య, కూతురు కళ్ల ముందే ఆయన్ని చంపేశారు. గురువారం ఆయన అంత్యక్రియలు జరిగాయి. వేల కొద్ది మంది అంత్యక్రియల్లో పాల్గొన్నారు. పాకీస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సంతోష్ కూతురు 26 ఏళ్ల అసవారి రక్తపు మరకలు నిండిన బట్టలతోటే అంత్యక్రియల్లో పాల్గొంది. తండ్రిని ఉగ్రవాదులు కాల్చి చంపినపుడు ధరించిన బట్టలతోటే తండ్రికి వీడ్కోలు చెప్పింది.


ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వైరల్‌గా మారిన ఓ వీడియోలో.. అసవారి నడవడానికి కూడా ఓపిక లేనట్లుగా ఉంది. పక్కన ఇద్దరు మగవాళ్లు ఆమెను పట్టుకుని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. అసవారి కుండపట్టుకుని ఏడుస్తూ ముందుకు వెళుతూ ఉంది. అంతక్రియలకు ముందు సంతోష్ కుటుంబాన్ని మహారాష్ట్ర మంత్రి మధురి మిసల్ పరామర్శించారు. అంతేకాదు.. ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ కూడా సంతోష్ కుటుంబాన్ని పరామర్శించారు. వారిని తన సానుభూతి తెలిపారు. సంతోష్ భార్య, కూతురు పహల్గామ్‌లో జరిగిన దాన్ని ఆయనకు వివరించి చెప్పారు. ఆ సంఘటన తలుచుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు.


వెకేషన్‌లో విషాదం

మహారాష్ట్రలోని పూణెకు చెందిన సంతోష్ జగదాలెకు ఇంటీరియర్ డిజైనింగ్ బిజినెస్ ఉంది. కొద్ది రోజుల క్రితం ఆయన తన భార్య ప్రగతి, కూతురు అసవారితో జుమ్మూకాశ్మీర్ పర్యటనకు వెళ్లారు. చనిపోయే ముందుకు వరకు కుటుంబం బాగా ఎంజాయ్ చేసింది. ఏప్రిల్ 22న మధ్యాహ్నం ఊహించని సంఘటన చోటుచేసుకుంది. ఉగ్రవాదులు బైసరన్ లోయలోని పర్యాటకులపై కాల్పులకు పాల్పడ్డాడు. ఉగ్రవాదులు సంతోష్‌పై కాల్పులు జరుపుతున్నపుడు .. రేవతి, అసవారి కొన్ని అడుగుల దూరంలోనే ఉన్నారు. అంతా క్షణాల్లోనే జరిగిపోయింది. వారి కళ్లముందే సంతోష్‌ను కాల్చి చంపారు. ఈ ఉగ్రదాడిలో మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు.


ఇవి కూడా చదవండి

Waqf Bill Supreme Court hearing: వక్ఫ్ బిల్లు చట్టభద్ధతపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ

Ranya Rao Gold Smuggling Case: బళ్లారి నగల వ్యాపారి బెయిలు తిరస్కరణ

Updated Date - Apr 24 , 2025 | 02:57 PM