Home » Tamil Nadu
తమిళనాడులో డీఎంకే ఓటమిపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తొలిసారి స్పందించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తున్నామని, విజేతలను అభినందిస్తున్నామని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పేర్కొన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడు సీఎం స్టాలిన్ ఓటమిని చవిచూశారు. కొళత్తూర్ నియోజకవర్గంలో టీవీకే నేత వీఎస్ బాబు చేతిలో 9 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.
తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో అడుగుపెట్టిన విజయ్ సారథ్యంలోని టీవీకే విజయపథంలోకి దూసుకెళ్తోంది. అయితే మెజారిటీకి 118 సీట్లు అవసరమవుతాయి. మెజారిటీ తగ్గిన పక్షంలో ప్రభుత్వం ఏర్పాటుకు ఏయే పార్టీలతో టీవీకే సంప్రదింపులు జరిపే అవకాశం ఉందనే దానిపై తాజాగా సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
తమిళనాట ప్రస్తుతం 100కు పైగా సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతున్న నేపథ్యంలో యాక్సిస్ మై ఇండియా చీఫ్ ప్రదీప్ గుప్తా కీలక వ్యాఖ్యలు చేశారు. విజయ్ గెలుస్తారని తాము ముందే చెబితే అంతా నవ్వారని అన్నారు. అయితే, ఈ విజయం తమది కాదని డేటా సైన్స్ది అని అన్నారు.
ప్రముఖ నటి త్రిష కృష్ణన్ సోమవారం 43వ పుట్టినరోజు. ఈ సందర్భంగా రాజకీయ, సినీ ప్రముఖుల నుంచి ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ బుధవారం సాయంత్రం 6 గంటలకు ముగియనుండటంతో అందరి దృష్టి ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్పై పడింది. బెంగాల్తో పాటు ఇప్పటికే ముగిసిన తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు సాయంత్రం 6.30 గంటలకు వెలువడనున్నాయి.
దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి రాష్ట్రాల్లోని అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు, ఏడు శాసనసభ నియోజకవర్గాల ఉప ఎన్నికల ఫలితాలపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రోజున కౌంటింగ్ సెంటర్ల వద్ద అంతరాయాలు కలిగించడానికి బీజేపీ పథక రచన చేస్తోందని అధికార డీఎంకే (DMK) ఆరోపించింది. పెద్దఎత్తున శాంతిభద్రతలకు ఆటంకం కలిగే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు డీఎంకే ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్.ఎస్.భారతి ఎన్నికల ప్రధానాధికారికి ఆదివారంనాడు లేఖ రాశారు.
తమిళనాడు, పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఉద్దేశించిన రూ.1,000 కోట్లకు పైగా విలువచేసే నగదు, మద్యం, డ్రగ్స్, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
తమిళనాడులో ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. మెుత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల అధికారులు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఎన్నికల బరిలో మెుత్తం 4,023 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కాగా