Home » Tamil Nadu
వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే)తో పొత్తు కుదుర్చుకోనున్నట్లు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
కరూర్లో టీవీకే అధ్యక్షుడు విజయ్ ప్రచారపర్యటన సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన 41 మంది కుటుంబాలను దత్తత తీసుకుంటామని ఆ పార్టీ ప్రచార విభాగం ప్రధాన కార్యదర్శి ఆదవ్ అర్జునా తెలిపారు.
రాష్ట్రంలో ఉన్నత విద్యా శాఖపై గవర్నర్ ఒత్తిడి తెస్తున్నారని ఉన్నత విద్యాశాఖ మంత్రి కొవి చెళియన్ ఆరోపించారు. తిరుచ్చిలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ... విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో అధికంగా ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొనడం అర్థ రహితమన్నారు.
ప్రజాస్వామ్యంపై అధికార డీఎంకేకు నమ్మకం లేదని, అందువల్లే ఎన్నికల హామీలు విస్మరించి అవినీతి పాలన సాగిస్తోందని మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి ఆరోపించారు.
వ్యాయామం చేస్తూ విద్యార్థి మృతిచెందాడు. రామనాథపురం జిల్లా ఏర్వాడికి చెందిన మహ్మద్ ఫాహిం(17) ఆ ప్రాంతంలోని ఓ పాఠశాలలో ప్లస్ టూ చదువుతున్నాడు.
చేపలలో అనేక రకాలు ఉన్నాయి. అయితే, మీరు ఎప్పుడైనా డూమ్స్డే చేప చూశారా? ఈ చేప కిలోల బరువు, దీని పొడవు చూస్తే ఆశ్చర్యపోతారు..
పీఎంకే వ్యవస్థాపకుడు రాందాస్ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు చేసుకుని ఇంటిపట్టున గడుపుతున్నారని, ఆయన ప్రశాంతతకు భంగం కలిగించేలా ఆరోగ్యానికి హాని కలిగిస్తే చూస్తూ ఊరుకోనని ఆయన తనయుడు, పీఎంకే నేత డాక్టర్ అన్బుమణి రాందాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ఈనెల 16 నుంచి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించే అవకాశముందని ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం అంచనా వేసింది. ఈ రుతుపవనాలపై రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లను ముమ్మరం చేసింది.
దివంగత సీఎం జయలలిత మృతిపై జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా సీబీఐతో దర్యాప్తు చేయించాలని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోమంత్రి అమిత్షా, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్కు విజ్ఞప్తి చేశారు.
తిరుపతి నుంచి చెన్నై సెంట్రల్కు బయల్దేరే రైలు, తిరుపతికి బదులు తిరుచానూరు నుంచి బయల్దేరనుంది. ఈ మేరకు దక్షిణ రైల్వే విడుదల చేసిన ప్రకటనలో... మరమ్మతు పనుల కారణంగా చెన్నై సెంట్రల్ నుంచి తిరుపతికి వెళ్లే అన్ రిజర్వ్డ్ రైళ్ల సేవలో మార్పులు చోటుచేసుకున్నాయని తెలిపింది.