Home » Sunday
సంపన్నులతో వేలూ లక్షలూ ఖర్చుపెట్టించే తిరుమల వెంకన్న, పేదలకు మాత్రం పైసా ఖర్చు లేకుండా తన దర్శనం చేసుకునే అవకాశం కల్పించాడు. తిరుపతికి చేరుకున్న భక్తులు చేతిలో పైసా లేకపోయినా సలక్షణంగా తిరుమలకు చేరుకుని స్వామి దర్శనం చేసుకోవచ్చు.
తిరుమల అనగానే శ్రీవేంకటేశ్వరుడు కొలువైన దివ్య క్షేత్రం అని అందరికీ తెలుసు. అయితే తిరుమల ఆలయంలో కలియుగ అవతారమైన శ్రీనివాసుడితో పాటూ త్రేతాయుగంలో ఆరాధ్యుడైన శ్రీరాముడు, ద్వాపర యుగంలో భక్తజన రక్షకుడైన శ్రీకృష్ణుడు కూడా భక్తుల పూజలను స్వీకరిస్తూ అంతే వైభవంగా వేడుకలు అందుకుంటున్నారని చాలామందికి తెలియదు.
హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి అంటే ఒక ముహూర్తం ఉండాలి. తాళి, తలంబ్రాలు ఉండాలి. మంగళమేళాలు హంగూ ఆర్భాటాలు తప్పనిసరి. తిరుమల శ్రీవేంకటేశ్వరుడి సన్నిధిలో మాత్రం వీటిలో దేనికీ ప్రాధాన్యం లేదు. ఇవేవీ లేకుండానే పెళ్లి జరిగిపోతుంది.
తిరుమల వెంకన్నకి రోజూ షడ్రసోపేతమైన ఆహారపదార్థాలే నైవేద్యంగా పెడతారు. ఇవన్నీ పోషకవిలువలు మెండుగా ఉన్నవే. ఆయుర్వేదపరంగా అత్యంత ఆరోగ్యకరమైనవే. దాదాపు 50 రకాలైన నైవేద్యాలను స్వామికి సమర్పిస్తారు.
ప్రపంచ సంపన్నుల జాబితాను ఏటా లెక్కలు కట్టి వెల్లడించే ‘ఫోర్బ్స్’ సంస్థ గనుక దేవుళ్లలోకెల్లా ధనవంతులెవరు? అని ఆరా తీసి అంచనా వేస్తే... నెంబర్ వన్ స్థానం బహుశా మన తిరుమల వెంకన్నకే దక్కుతుంది. వేంకటేశుని ధర్మకర్తల మండలి టీటీడీ వార్షిక బడ్జెట్టే రూ.5వేల కోట్లకు పైనే.
తిప్పికొడితే టేప్ అంత పొడవు కూడా ఉండడు. కానీ టేప్ భుజాలపై వేసుకుని చకచకా డిజైన్లు గీస్తుం టాడు. ఆ పిల్లోడు సృష్టించిన దుస్తుల కోసం ఏకంగా సెలబ్రిటీలే క్యూ కడుతుంటారు. అమెరికాకు చెందిన తొమ్మిదేళ్ల మ్యాక్స్ అలెంగ్జాండర్ పేరు ప్రస్తుతం ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో చక్కర్లు కొడుతోంది.
ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ, ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్న వారికి... ఒక చిన్న ఆత్మీయ పలకరింపు, ఒక స్పర్శ ఎంతో సాంత్వనను అందిస్తుంది. ఎప్పుడైనా సరే... పెంపుడు జంతువులతో కాసేపు గడిపితే ఒత్తిడి ఇట్టే దూరమై, మనసు తేలికపడుతుందంటారు ఆరోగ్య, మానసిక నిపుణులు.
ఆపద సమయాల్లో ఆత్మరక్షణకు... గర్భిణులు సాఫీగా నిద్రపోయేందుకు... ఆఫీసులో గంటల తరబడి కూర్చున్నా, పాదాలు వాపు రాకుండా ఉండేందుకు... ఇలాంటి కొన్ని మహిళకు సంబంధించిన సమస్యలకు, పరిష్కారాన్ని చూపే ఫ్రెండ్లీ గ్యాడ్జెట్స్ ఉన్నాయి. వాటి విశేషాలే ఇవి...
గోధుమపిండిలో ఉప్పు, నెయ్యి తగినంత కలిపి కొద్దిగా నీళ్లు పోసి, మెత్తగా మర్దించి మూతబెట్టి అరగంట పాటు పక్కన ఉంచండి! కొద్దిగా నెయ్యి వేసి వేగించిన శనగపిండిలో కోరిన మసాలా ద్రవ్యాలు, కొత్తిమీర, ఆవనూనె, నిమ్మరసం చాలినంత వేసి ముద్దగాచెయ్యండి.
పదేళ్లలోపు పిల్లల్లో కంటి ఆరోగ్యం చాలా ముఖ్యం, ఎందుకంటే ఈ వయసులోనే చూపు బలంగా ఉండేందుకు పునాది ఏర్పడుతుంది. సరైన ఆహారం ద్వారా కంటి ఆరోగ్యాన్ని బలోపేతం చేయవచ్చు. విటమిన్ ఎ పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు ఇవ్వాలి, ఇవి చూపును కాపాడటంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి.