Home » Sri Satyasai
శ్రీ సత్య సాయి జిల్లా: బత్తలపల్లి మండలం, రామాపురం గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున రామాపురం బస్ స్టాప్కు సమీపంలో తుపాకీ కాల్పుల మోత కలకలం రేపింది. తుపాకుల శబ్దంతో రామాపురం గ్రామ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బీహార్కు చెందిన దొంగల ముఠా రామాపురం గ్రామ పరిసరాల్లో సంచరిస్తున్నారని గమనించిన తెలంగాణ పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు.
భారతీయ జనతా పార్టీ 18 కోట్ల సభ్యత్వంతో అగ్రగామి పారీగా నిలిచిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. స్థానిక ఎన్డీఏ కార్యాలయంలో శనివారం నిర్వహించిన భారతీయజనతాపార్టీ ఎస్సీ మోర్చా సత్యసాయిజిల్లా సభ్యత్వ నమోదు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
స్మార్ట్ మీటర్ల రాకతో రీడర్ల బతుకు ప్రశ్నార్థకంగా మారింది. ఉద్యోగం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఊడుతుందోనని ఆందోళన చెందుతున్నారు. కొన్నేళ్లుగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా చాలీచాలని వేతనాలతో కొనసాగుతున్నారు.
ప్రతి ఉద్యోగి తాము పని చేసే కార్యాలయాన్ని దేవాలయంలా భావించాలని మండల న్యాయసేవాధికార సంస్థ చైర్పర్సన, న్యాయాధికారి ఎస్.జయలక్ష్మి అన్నారు.
ప్రైవేటు మద్యం దుకాణాల లైసెన్సుల జారీ లాటరీ అధికార కూటమికి లక్కీ లాటరీగా మారింది. జిల్లా కేంద్రం పుట్టపర్తిలోని సాయి ఆరామంలో సోమవారం మద్యం దుకాణాలకు లక్కీడ్రా కల్టెకర్ చేతన ఆధ్వర్యంలో నిర్వహించారు.
ద సరా పండగంటే పదిరోజుల వేడుక. దీంతో పూల ధరలకు రెక్కలొచ్చాయి. అమాంతం ధరలు పెరిగిపోయాయి. శరన్నవరాత్రి నేపథ్యంలో ప్రస్తుతం పూలధరలు ఒకేసారి పెంచేశారు.
మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు లేక ఖాళీగా దర్శనమిస్తోంది. అత్యంత కీలకమైన రెవెన్యూ శాఖలో సిబ్బంది ఉన్నా ప్రజా పనులు జరగడం లేదు.
పొట్టకూటి కోసం రేయింబవళ్లు కష్టపడి పనిచేసే ప్లంబర్ వృత్తిమాది... అయితే కొందరు వ్యక్తులు కోర్టుకు వెళ్లడంతో 2022లో ప్లంబర్స్ అసోసియేషనకు ఆ భూమిని కేటాయిస్తూ కోర్టు తీర్పనివ్వడంతో ప్రభుత్వ పెద్దల సహకారంతో ఉన్నభూమిని పంచుకున్నామని ఆ సంఘం ఉపాధ్యక్షుడు సురేంద్రబాబు పేర్కొన్నారు.
ఫిర్యాదుదారుల సమస్యలను ప రిస్కరించడమే ధ్యేయమని, ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని ఎస్పీ రత్న పోలీసు అధికారులను ఆదేశించారు.
పేద ఖైదీలకు సాధికార కమిటీ ఏర్పాటుచేయాలని కలెక్టర్ టీఎస్ చేతన అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదికలో 171 ఫిర్యాదులు స్వీకరించారు.