Home » Sonia Gandhi
Andhrapradesh: ‘‘యాత్ర 2’’ సినిమాలో సోనియా గాంధీ పాత్రపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బుధవారం ఏఐసీసీ నెంబర్ నరహరిశెట్టి నరసింహారావు మీడియాతో మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డికి రాజకీయ బిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీపై బురద జల్లడాన్ని ఖండిస్తున్నామన్నారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనాయకురాలు, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. దీంతో బుధవారం ఆమె ఢిల్లీ నుంచి జైపూర్కు బయలుదేరారు.
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రేపు (బుధవారం) రాజ్యసభకు నామినేషన్ వేయనున్నారు. రాజస్థాన్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ దాఖలు కోసం సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే రేపు జైపూర్ వెళ్లనున్నారు.
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పోటీ చేసే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని రాయబరేలి లోక్సభ నియోజకవర్గానికి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
యూపీఏ హయాంలో జవాబుదారీతనం లేదని, ప్రజల సమస్యలు పట్టించుకున్న నేతా ఉండేవారు కాదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) ఆక్షేపించారు. లోక్సభలో ఆమె కాంగ్రెస్(Congress) పార్టీపై విరుచుకుపడ్డారు.
Sonia Gandhi Reaction on Bharat Ratna Award: దివంగత ప్రధాన మంత్రి, కాంగ్రెస్ నాయకుడు పీవీ నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ లకు శుక్రవారం నాడు కేంద్ర ప్రభుత్వం భారత రత్న అవార్డును ప్రకటించింది. ఈ ముగ్గురు ప్రముఖులకు భారత రత్న ప్రకటించడంపై యావత్ భారతదేశం హర్షం వ్యక్తం చేస్తోంది.
ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ(Sonia Gandhi)తో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy) భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. రేవంత్ వెంట డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు.
సీఎం రేవంత్రెడ్డి ( CM Revanth Reddy ) హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో శుక్రవారం నాడు ఢిల్లీకి బయలు దేరి వెళ్లారు. కాసేపటి క్రితమే సీఎం ఢిల్లీకి చేరుకున్నారు.
అయోధ్య రామాలయంలో ఈనెల 22న జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని హాజరుకావాలంటూ వచ్చిన ఆహ్వానాన్ని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తిరస్కరించడంపై బీజేపీ తొలిసారి స్పందించింది. ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ చింతించాల్సి వస్తుందని కేంద్ర మంత్రి, బీజేపీ నేత హర్దీప్ సింగ్ పురి అన్నారు.
అయోధ్య రామజన్మభూమిలో రామ్లల్లా ప్రాణ ప్రతిష్ట కోసం హిందువులు ఆతృతతో ఎదురు చూస్తున్నారు. తాము మాత్రం హాజరుకాబోమని కాంగ్రెస్ పార్టీ స్పష్టంచేసింది. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం బీజేపీ, ఆర్ఎస్ఎస్ పొలిటికల్ మైలేజీ కోసం చేస్తోన్న ఈవెంట్ అని మండిపడింది.