Home » Siddaramaiah
ఆర్సీబీ ఐపీఎల్ టీమ్ విజయోత్సవాన్ని విభేదిస్తూ తాను సీఎంకు సలహా ఇచ్చానని గోవిందరాజ్ పేర్కొన్నట్టు ఒక కథనం వచ్చింది. అయితే తన మాటలను వక్రీకరించారని, ఈ అంశంపై తాను ఎప్పుడూ ముఖ్యమంత్రికి సలహా ఇవ్వలేదని గోవిందరాజ్ వివరణ ఇచ్చారు.
ఇది రాజకీయాలు చేసే సమయం కాదని, అలాగని ఘటనను సమర్ధించడం లేదని, కుంభమేళాలో కూడా తొక్కిసలాట జరిగిందని సీఎం సిద్ధరామయ్య చెప్పారు. గాయపడిన వారిలో చాలామందికి చిన్నచిన్న గాయాలే అయ్యాయని, వారు ఆసుపత్రిలో చేరలేదని చెప్పారు.
తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందంటూ సినీ నటుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్య కర్ణాటకలో పెద్ద దుమారమే రేపుతోంది. తాను క్షమాపణ చెప్పనంటూ కమల్ కోర్టుకెక్కడంతో ఈ వివాదం తగ్గే సూచనలు కనిపించడం లేదు.
కమల్హాసన్ ఇటీవల చెన్నైలో జరిగిన 'థగ్ లైఫ్' చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంలో మాట్లాడారు. కన్నడ భాష కూడా తమిళం నుంచే పుట్టిందని ఈ సందర్భంగా అన్నారు. ఆయన వ్యాఖ్యలు కన్నడ నాట దుమారం రేపాయి.
కర్ణాటకలోని అనేకల్ తాలూకా సూర్యానగర్ బ్రాంచ్లో చోటుచేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో అధికారులు చర్యలకు దిగారు. కాగా, బ్యాంకు మేనేజర్ చర్యను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్రంగా ఖండించారు.
పహల్గాం ఉగ్రదాడిలో మృతిచెందిన మంజునాథ్రావ్, భరత్భూషణ్ మృతదేహాలు బెంగళూరు ఎయిర్పోర్టు ద్వారా స్వస్థలాలకు చేరి, మంత్రి, గవర్నర్, సీఎం నివాళులర్పించారు
ముడాకు చెందిన 14 స్థలాలను అక్రమంగా తన భార్యకు కేటాయించారనే ఆరోపణలను సిద్ధరామయ్య ఎదుర్కొంటున్నారు. లోకాయుక్త పోలీసులు చేస్తున్న విచారణను సీబీఐకి అప్పగించాలంటూ గతంలో స్నేహమయి కృష్ణ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. దీనిపై పిటిషనర్ మరోసారి కోర్టును ఆశ్రయించారు.
ముడా భూముల కేటాయింపులో సిద్ధరామయ్య ఎలాంటి తప్పు చేయలేదని కర్ణాటక లోకాయుక్త పోలీసులు ఇటీవల క్లీన్చిట్ ఇచ్చారు. అయితే దీనిని ఈడీ, హక్కుల కార్యకర్త స్నేహమయి కృష్ణ సవాలు చేశారు. మరింత లోతుగా దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.
మార్చి 3న కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.12.57 కోట్ల బంగారంతో రన్యారావు పట్టుబడ్డారు. ఆ బంగారాన్ని సీజ్ చేసిన డీఆర్ఐ ఆ తర్వాత బెంగళూరులోని ఆమె నివాసం నుంచి మరో 2.06 కోట్ల బంగారం, 2.67 కోట్ల నగదు స్వాధీనం చేసుకుంది.
కర్ణాటక ముఖ్యమంత్రి తన అధికార నివాసాన్ని 'శీష్ మహల్' తరహాలో పునరుద్ధరించుకునేందుకు భారీగా ఖర్చు చేస్కు్న్నారంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఓవైపు ప్రజాపనుల కోసం నిధులు లేవంటూ సొంత పనులకు భారీ ఖర్చులు ఎందుకంటూ నిలదీస్తు్న్నాయి.