Home » Seethakka
సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేయడం ద్వారా ప్రజా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని పంచాయతీ కార్యదర్శులకు మంత్రి సీతక్క సూచించారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం బాధ్యతలను జిల్లాల వారీగా కలెక్టర్లు పర్యవేక్షిస్తుండగా.. ఐటీడీఏల పరిధిలో మాత్రం ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ల (పీవో)కు అప్పగించాలని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
Seethakka Slams KTR : సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్ అయితే.. పత్తా లేకుండా ఎక్కడికి వెళ్లారని మంత్రి సీతక్క ప్రశ్నించారు. సత్తా ఉంటే అసెంబ్లీకి వచ్చి సత్తా నిరూపించుకోవాలని హితవుపలికారు. ఉద్యోగుల పోరాటాన్ని వాడుకున్న చరిత్ర బీఆర్ఎస్ ది అంటూ ఫైర్ అయ్యారు.
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ను వెంటనే నిలిపివేయాలని మంత్రి ధనసరి సీతక్క డిమాండ్ చేశారు. తెలంగాణ- ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని నిలువరించేలా చొరవ చూపాలని కోరారు.
Seethakka On Operation Kagar: ప్రభుత్వాలు రాజ్యాంగానికి లోబడే వ్యవహరించాలని మంత్రి సీతక్క సూచించారు. బల ప్రయోగంతో కాకుండా, చర్చల ద్వారా సమస్య పరిష్కారం జరిగేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాలని ఆదివాసి బిడ్డగా కోరుకుంటున్నానని తెలిపారు.
అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అయ్యే ఆహార నాణ్యతను మెరుగుపరచడం, మరింత రుచికరంగా మార్చేందుకు ఎన్ఐఎన్, యునిసెఫ్ నిపుణులతో కమిటీ వేశామని, వారి నివేదిక ఆధారంగా ఆహారంలో మార్పులు చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు.
రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో రకాల ప్రోత్సాహకాలు అందిస్తోందని మంత్రి సీతక్క తెలిపారు. మహిళా సంఘాల సక్సెస్ స్టోరీలను పుస్తక రూపంలో ఇవ్వడం ద్వారా ఇతరులకు స్ఫూర్తి కలుగుతుందని పేర్కొన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామిక రాజకీయాలు పూర్తిగా మారిపోయాయని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ అన్నారు. పదేళ్ల క్రితం అనుసరించిన రాజకీయ సూత్రాలు, అప్పుడు ప్రభావశీలంగా ఉన్న విధానాలు ఇప్పుడు పనికిరావన్నారు.
దేశ ప్రజల మధ్య కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టడమే బీజేపీ నైజమని రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆరోపించారు.
ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి సీతక్క అన్నారు. ఆదివారం ఇంద్రవెల్లి స్థూపం వద్ద నిర్వహించిన సంస్మరణ సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.