Home » Security Breach
పార్లమెంటులో భద్రతా ఉల్లంఘన తీవ్రమైనదని, దీనిపై చర్చ అవసరం లేదని, సమగ్ర విచారణ జరగాలని ప్రధాన మంత్రి మోదీ పిలుపునిచ్చినప్పటికీ ఉభయసభల్లో ప్రతిపక్షాలు వెనక్కి తగ్గడం లేదు. ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్షా ఒక ప్రకటన చేయాలని విపక్ష ఎంపీలు పట్టువిడుపులు లేని ధోరణిలో ఆందోళన సాగిస్తుండటంతో తాజాగా 30 మందికి పైగా ఎంపీలు సస్పెండయ్యారు.
పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో డిసెంబర్ 13న పలువురు వ్యక్తులు అక్రమంగా ప్రవేశించి స్మోక్ గన్స్ విసిరిన(Parliament Security Breach) విషయం విదితమే.
పార్లమెంటులో అలజడికి సంబంధించి కీలక నిందితుడిగా భావిస్తున్న లలిత్ ఝాను పాటియాలా హౌస్ కోర్టు శుక్రవారంనాడు ఏడు రోజుల పోలీస్ కస్టడీకి పంపింది. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ స్పెషల్ సెల్ ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతోంది.
పార్లమెంటులో బుధవారం తలెత్తిన భద్రతా వైఫల్యాన్ని కేంద్రం సీరియస్గా తీసుకుంది. అత్యవసర చర్యలకు ఉపక్రమించింది. పార్లమెంటు భద్రతా నిబంధనల్లో మార్పులు చేపట్టింది. లోక్సభలోకి సందర్శకుల గ్యాలరీ నుంచి ఆగంతకులు లోపలకు దూకి స్మోక్ గ్యాస్ వదలడం, బెంచీలపై దూకుతూ పరుగులు తీయడం ఎంపీలను భయభ్రాంతులను చేసిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2022 జనవరి 5న పంజాబ్ లో జరిపిన పర్యటనలో భద్రతా లోపంపై బడిండా ఎస్పీ గుర్వీందర్ సింగ్ సంఘాను సస్పెండ్ చేశారు. పంజాబ్ హోం మంత్రిత్వ శాఖ శనివారంనాడు ఈ విషయం తెలిపింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత ఏడాది జనవరిలో పంజాబ్ (Punjab) పర్యటన సందర్భంగా తలెత్తిన భద్రతా లోపాల..
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఢిల్లీలో అడుగుపెట్టిన సమయంలో జనాలను అదుపు చేయడంలో పోలీసుల..