Home » Secunderabad
మహానగర పరిధిలోని మూడు కమిషనరేట్ల పరిధిలో ఈ ఏడాది సుమారు 85 వేల విగ్రహాలు కొలువుదీరినట్లు తెలుస్తోంది. చిన్న చిన్న గల్లీలు, అపార్ట్మెంట్స్, ఇతర చిన్న విగ్రహాలు కలుపుకొని లక్ష విగ్రహాలు ఉంటాయని పోలీసులు అంచనా వేస్తున్నారు.
సికింద్రాబాద్ స్టేషన్లో పునరాభివృద్ధి పనులు కొనసాగుతున్నందున ఆయా ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లను బుధవారం నుంచి నవంబర్ 26 వరకు మల్కాజ్గిరి, హైదరాబాద్, చర్లపల్లి టెర్మినల్స్కు పొడిగిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
దక్షిణమధ్యరైల్వే పరిధిలో విజయవాడ మీదుగా వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్న పలు ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లకు కొండపల్లి స్టేషన్లో హాల్ట్ను తాత్కాలికంగా ఎత్తివేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. కొండపల్లి రైల్వేస్టేషన్లో ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభం కానున్నందున హాల్ట్ తొలగింపు నిర్ణయం తీసుకున్నారు.
దక్షిణమధ్యరైల్వే పరిధిలోని వివిధ మార్గాల్లో నడుస్తున్న ప్యాసింజర్ రైళ్ల నంబర్లలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. అలాగే, కొన్ని ప్యాసింజర్ రైళ్లకు ప్రస్తుతం ఉన్న ఐసీఎ్ఫ(ఇండియన్ కోచ్ ఫ్యాక్టరీ) కోచ్ల స్థానంలో డెమో, మెమూ కోచ్లను ఏర్పాటు చేయాలని రైల్వే ఉన్నతాధికారులు నిర్ణయించారు.
అయోధ్య-కాశీ పుణ్యక్షేత్ర యాత్ర కోసం ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలును నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ రైలు సెప్టెంబరు 9న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 11 గంటలకు ప్రారంభం అవుతుందని సీపీఆర్ఓ శ్రీధర్ తెలిపారు.
చర్లపల్లి నుంచి చెన్నై వెళ్లే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్(12604)కు నాయుడుపేట్లో అదనపు స్టాపేజీ కల్పించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈరోజు నుంచి నాయుడుపేట్ రైల్వే స్టేషన్లో రెండు నిమిషాల పాటు రైలు ఆగుతుందని (హాల్టింగ్) దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా చర్లపల్లి-కాకినాడ నాందేడ్-తిరుపతి మధ్య వీక్లీ స్పెషల్ రైళ్లను పొడిగించినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అరాచకాలు తవ్వేకొద్దీ బయటికి వస్తున్నాయి. తాజాగా, డాక్టర్ నమ్రతకు చెందిన 8 బ్యాంక్ అకౌంట్లను పోలీసులు సీజ్ చేశారు.
ప్రయాణికుల రద్దీని నియంత్రించడానికి సికింద్రాబాదు- మైసూర్-సికింద్రాబాద్ (వయా గుంతకల్లు) ప్రత్యేక బైవీక్లీ ఎక్స్ప్రెస్ను నడపనున్నట్లు రైల్వే అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాదు-మైసూర్ బైవీక్లీ ప్రత్యేక రైలు (07033) ఈ నెల 8 నుంచి 29 వరకూ సోమ, శుక్రవారాలలో నడపనున్నారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పునరాభివృద్ధి పనులు కొనసాగుతున్నందున వేర్వేరు ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చే పలు రైళ్లను అక్టోబరు 19వ తేదీ వరకు ఇతర స్టేషన్లకు మళ్లిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.