Home » SBI
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్య పరపతి విధాన కమిటీ (MPC) నిర్ణయాలను శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్(Shaktikanta Das) వెల్లడించనున్నారు. బుధవారం నుంచి జరుగుతున్న ఈ సమీక్షలోనూ వడ్డీ రేట్లు మార్చే అవకాశం లేనట్లు తెలుస్తోంది.
అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని దుండగులు ఎస్బీఐ ఏటీఎం(SBI ATM)లో చోరీకి పాల్పడి సుమారు రూ.17లక్షలు ఎత్తుకెళ్లిన ఘటన పరవాడ(Paravada) దేశపాత్రునిపాలెంలో చోటు చేసుకుంది. రాత్రి వేళ కారులో వచ్చి గ్యాస్ కట్టర్లతో ఏటీఎంను ధ్వంసం చేసి దొంగతానికి పాల్పడ్డారు.
బీఆర్ఎస్ పార్టీని వరుసగా మూడోసారి అధికారంలోకి తెచ్చేందుకే అప్పటి ఎస్ఐబీ చీఫ్ నేతృత్వంలో తామంతా కలిసి పనిచేసినట్లు ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన కీలక నిందితుడు, టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ (ఓఎస్డీ) రాధాకిషన్ రావు తన నేరాంగీకార వాంగ్మూలంలో వెల్లడించారు. ‘‘2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు శ్రవణ్ కుమార్ నియోజకవర్గాలవారీగా నిర్వహించిన సర్వేలో.. బీఆర్ఎస్ పార్టీకి 50 సీట్లు కూడా రావని తేలింది.
ఇటివల కాలంలో సైబర్ మోసాలు(cyber crime) పెరిగిపోయాయి. గతంలో అయోధ్య రామ మందిరం సహా పలు సందేశాల పేరుతో అనేక మందిని లూటీ చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఇటివల కేటుగాళ్లు దేశంలోనే ప్రముఖ బ్యాంకైన SBI పేరుతో పలువురికి సందేశాలు పంపిస్తూ దోపిడికీ పాల్పడుతున్నారు.
ఫిక్స్డ్ డిపాజిట్లపై (ఎఫ్డీ) ఎస్బీఐ వడ్డీరేట్లు పెంచింది. ఎఫ్డీల కాల పరిమితిని బట్టి ఈ పెంపు 0.25 శాతం నుంచి 0.75 శాతం వరకు ఉంటుంది...
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు గుడ్ న్యూస్ అందించింది. ఈ క్రమంలో రూ. 2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై కస్టమర్లకు వడ్డీ రేట్లను ఎస్బీఐ పెంచింది. ఈ క్రమంలో ఫిక్స్డ్ డిపాజిట్లపై SBI కొత్త వడ్డీ రేట్లను 0.25 నుంచి 0.75 శాతం వరకు పెంపు చేస్తున్నట్లు ప్రకటించింది.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్, ఎస్ఐబీ ప్రధాన కార్యాలయంలో హార్డ్ డిస్క్ల విధ్వంసం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు అరె్స్టకు వారెంట్ జారీ అయింది. ప్రభాకర్రావుతో పాటు మరో కీలక నిందితుడు శ్రవణ్కుమార్పై కూడా నాంపల్లి కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది.
సమాచార హక్కు (సహ) చట్టం కింద ఎన్నికల బాండ్ల వివరాలను అందజేసేందుకు ఎస్బీఐ నిరాకరించింది. ఇప్పటికే ఆ వివరాలన్నీ ఈసీ వెబ్సైట్లో ఉన్నప్పటికీ.. డబ్బుకు సంబంధించిన వ్యక్తిగత సమాచారమైనందున బాండ్ల వివరాలను వెల్లడించలేమని ఎస్బీఐ తెలియజేయడం గమనార్హం.
మీకు ప్రతి నెల కొంత అదనపు ఆదాయం రావాలని కోరుకుంటున్నారా? అయితే మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో అందుకోసం బెస్ట్ స్కీం ఉంది. అదే SBI యాన్యుటీ డిపాజిట్ స్కీమ్(SBI Annuity Deposit Scheme). దీనిలో ఒకేసారి కొంత మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసి.. ఆ తర్వాత ప్రతి నెలా అసలు మొత్తంతో పాటు నెలవారీ వడ్డీని కూడా పొందవచ్చు.
నూతన ఆర్థిక సంవత్సరం 2024-25 ఆరంభం కానున్న నేపథ్యంలో పలు ఆర్థిక సంబంధ నిబంధనలు మారబోతున్నాయి. తాజాగా ప్రభుత్వరంగ బ్యాకింగ్ దిగ్గజం ఎస్బీఐ కూడా కీలక అప్డేట్ ఇచ్చింది. పలు డెబిట్ కార్డ్లపై వార్షిక నిర్వహణ ఛార్జీలను పెంచుతున్నట్టు బుధవారం ప్రకటించింది. ఈ మేరకు సవరించిన కొత్త ఛార్జీలు ఏప్రిల్ 1, 2024 నుంచి అమల్లోకి వస్తాయని వివరించింది.