Home » Saudi Arabia
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సౌదీ అరేబియాకు పాకిస్థాన్ భారీ స్థాయిలో సైనిక బలగాలను పంపినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఇరు దేశాల మధ్య పరస్పర రక్షణ ఒప్పందం ఉన్న సంగతి తెలిసిందే.
ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ (OPEC) నుంచి వైదొలగాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) నిర్ణయించుకుంది. దాదాపు 60 సంవత్సరాల పాటు ఒపెక్లో సభ్య దేశంగా ఉన్న యూఏఈ ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది?
తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న పాకిస్థాన్కు సౌదీ అరేబియా మరోసారి అండగా నిలిచింది. తాజాగా 3 బిలియన్ డాలర్ల (సుమారు రూ.25 వేల కోట్లు) అదనపు ఆర్థిక సహాయం అందించేందుకు అంగీకరించింది. పాకిస్థాన్ విదేశీ మారక నిల్వలు క్షీణిస్తున్న వేళ సౌదీ ముందుకు వచ్చి ఆదుకుంది.
హోర్ముజ్ జలసంధిని యూఎస్ దిగ్బంధించడంపై సౌదీ అరేబియా ఆందోళనతో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ చర్యలతో ఇరాన్ మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నట్టు సమాచారం.
ఇటీవల ఇరాన్ జరిపిన మిసైల్ దాడిలో అమెరికాకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. సౌదీ అరేబియాలోని వైమానిక స్థావరంపై జరిగిన దాడిలో యూఎస్కు చెందిన అవాక్స్ నిఘా విమానం ధ్వంసమైంది.
ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాయిదా వేయడంతో ప్రపంచ దేశాలు కాస్త ఉపశమనం పొందాయి. ఇలాంటి తరుణంలో ప్రముఖ వాల్స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన ఓ కథనం సంచలనంగా మారింది.
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే బ్యారెల్ ముడి చమురు ధర ఏప్రిల్ నెలాఖరు నాటికి 180 డాలర్లకు చేరే అవకాశం ఉందని సౌదీ అధికారులు అంచనావేస్తున్నారు.
మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతల నేపథ్యంలో సౌదీ, బహ్రెయిన్ ఫార్ములా-1 ఈవెంట్స్ రద్దయ్యాయి. ప్రత్యామ్నాయ వేదికల్లో ఈవెంట్స్ నిర్వహించాలని మొదట అనుకున్నా చివరకు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్టు అధికారులు తెలిపారు.
సౌదీ అరేబియాలోని నివాస ప్రాంతంలో సైనిక ప్రొజెక్టైల్ పడిపోవడంతో ఒక భారతీయుడు మృతి చెందినట్టు వచ్చిన వార్తలను రియాద్లోని భారత రాయబార కార్యాలయం సోమవారంనాడు తోసిపుచ్చింది. అల్ ఖర్జ్ వద్ద జరిగిన దాడి ఘటనలో భారత్కు చెందిన వ్యక్తి ఎవరూ చనిపోలేదని వెల్లడించింది.
పశ్చిమాసియలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. తమ సుప్రీం లీడర్ అయుతొల్లా అలీ ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఆమెరికా వైమానిక స్థావరాలు, ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులకు పాల్పడుతోంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు, రాయబార కార్యాలయాలపై దాడులను ముమ్మరం చేసింది.