Home » sajjanar
మాజీ మంత్రి కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు శుక్రవారం హాజరైన విషయం తెలిసిందే. ఈ విచారణ అనంతరం సిట్ చీఫ్ సజ్జనార్ స్పందించారు. ఆధారాలు, రికార్డులు ముందుంచి కేటీఆర్ను విచారణ జరిపామని స్పష్టం చేశారు.
మహిళా అధికారులపై ఉద్దేశపూర్వక దుష్ప్రచారం ఆందోళనకరమని సీపీ సజ్జనార్ అన్నారు. ఇకపై మహిళలను అవమానిస్తే సహించేది లేదని సీపీ వ్యాఖ్యలు చేశారు.
ప్రజల ప్రాణాలు తీస్తున్న చైనా మాంజా అమ్మకాలు, వినియోగం విషయంలో తెలంగాణా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. ఈ అంశం మీద దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన కమిషన్.. ఫిబ్రవరి 26లోగా పూర్తి నివేదిక సమర్పించాలని సీపీ సజ్జనార్ను ఆదేశించింది.
హైదరాబాద్ ప్రజలను సీపీ సజ్జనార్ అభినందించారు. న్యూతన సంవత్సరం వేళ ప్రజలు ఎంతో బాధ్యతాయుతంగా ప్రవర్తించారని తెలిపారు. నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా ముగిశాయన్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, ‘ఆరా’ పోల్ స్ట్రాటజీస్ సంస్థ వ్యవస్థాపకుడు ఆరా మస్తాన్ను శుక్రవారం విచారించారు. ఈ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.
నూతన సంవత్సరం సందర్భంగా భాగ్యనగరంలో పలు ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ మరింత వేగం పుంజుకుంది. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం తాజాగా కొత్త ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సి హైదరాబాద్కు చేరుకున్నారు. గోట్ ఇండియా టూర్లో భాగంగా లియోనల్ మెస్సీతో పాటు రోడ్రిగో, లూయిస్ హైదరాబాద్కు వచ్చారు.
హైదరాబాద్ పోలీసు శాఖ మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో సీఐటీ (CIT.. సెంట్రల్ ఇన్వెస్ట్ గేషన్ టీమ్)ను ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ సన్నాహాలు చేస్తున్నారు.
సీసీ కెమెరాల నిర్వహణకు ప్రత్యేక బృందాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎంపవరింగ్ ఎవ్రీ డే సేఫ్టీ టీమ్స్ అంటూ నామకరణం చేసిన ఈ బృందాలను సీపీ సజ్జనార్ ప్రారంభించారు.