Home » sajjanar
నీట్ పరీక్ష వేళ తల్లిదండ్రులు, విద్యార్థులకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ పలు సూచనలు చేశారు. మెడికల్ సీట్ల పేరిట కొందరు మోసాలకు ప్రయత్నిస్తున్నారని.. వారిపట్ల తల్లిదండ్రులు జాగ్రత్త ఉండాలని అన్నారు.
పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ గురువారం పలు బ్యాంకుల సీనియర్ అధికారులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో నగరంలోని 45 ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులకు చెందిన 75 మంది సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
తొమ్మిదేళ్ల బాలికను కాపాడిన ముగ్గురు సామాన్య పౌరులను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఐపీఎస్ ప్రశంసించారు. చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న కామాంధుడిని ప్రాణాలకు తెగించి పట్టుకున్న సెజల్, గణపతి, కాశీనాథ్లను సీపీ సజ్జనార్ ప్రత్యేకంగా అభినందించారు.
హైదరాబాద్ నగరంలో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయని హైదరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. వాటర్ బోర్డు బిల్లుల పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ, వారి వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను దోచుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు.
పబ్లిక్, ప్రైవేట్ ప్రదేశాల్లో రహస్య కెమెరాలతో మహిళలను చిత్రీకరించే వారిపై ఉక్కుపాదం మోపుతామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. అందుకోసం ఇవాళ (శుక్రవారం) 'షీ నేత్ర టీమ్స్'ను రంగంలోకి దింపినట్లు ఆయన వెల్లడించారు.
హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పోలీసులు చేపట్టిన ‘ఆపరేషన్ డ్రగ్ ఫ్రీ సిటీ’ ఇప్పుడు పెను సంచలనం సృష్టిస్తోంది. రౌడీషీటర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ తీసుకున్న సాహసోపేత నిర్ణయం ఇప్పుడు నేరగాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.
భాగ్యనగరంలోని కీలకమైన షేక్పేట్ ఫ్లైఓవర్ నుంచి మాసాబ్ ట్యాంక్ వరకు ట్రాఫిక్ కష్టాలను తీర్చి, ఈ మార్గాన్ని 'మోడల్ కారిడార్'గా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా గురువారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, ఐపీఎస్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, ఐఏఎస్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు.
ఫేక్ ప్రిడిక్షన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మొద్దని సీపీ సజ్జనార్ హెచ్చరించారు. ఫేక్ ప్రిడిక్షన్లు, బెట్టింగ్లపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం కఠిన చర్యలు తీసుకుంటుందని సీపీ తెలిపారు.
వేసవి కాలంలో లభించే సీజనల్ ఫ్రూట్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. చూడ్డానికి ఆకర్షణీయంగా ఉండే పండ్లను చూసి మోసపోవద్దంటూ ఎక్స్ వేదికగా ఆయన కొన్ని సూచనలు చేశారు.
శోభాయాత్ర వేళ.. వివాదాస్పద వ్యాఖ్యలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానీ చేయ వద్దని ప్రజలకు నగర సీపీ సజ్జనార్ సూచించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రజలకు ఈ సందర్భంగా హైదరాబాద్ సీపీ వార్నింగ్ ఇచ్చారు.