Home » Russia-Ukraine war
ఉక్రెయిన్కు రష్యా ఊహించని షాకిచ్చింది. భారీ యుద్ధనౌకను సముద్ర డ్రోన్ ప్రయోగించి కూల్చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
శ్వేత సౌధం సలహాదారు పీటర్ నవారో భారత్పై మరోసారి తన అక్కసు వెళ్ళగక్కారు. ఉక్రెయిన్ యుద్ధం కొనసాగడానికి కారణం భారత్ చేపడుతున్న రష్యా చమురు కొనుగోళ్లేనని అన్నారు. ఈ ఘర్షణలను మోదీ యుద్ధం అంటూ సంచలన కామెంట్స్ చేశారు.
త్వరలో పుతిన్, జెలెన్స్కీ భేటీ ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని అన్నారు. శాంతి స్థాపన దిశగా ఇది తొలి అడుగని కూడా వ్యాఖ్యానించారు.
రష్యా చమురును కొనుగోలు చేస్తున్న చైనాను వదిలిపెట్టి భారత్పై సుంకాల వడ్డనకు కారణాలను అమెరికా విదేశాంగ శాఖ మంత్రి తాజాగా వివరించారు. రష్యా చమురులో అధిక శాతాన్ని చైనా శుద్ధి చేసి మళ్లీ ఎగుమతి చేస్తోందని, ఈ దశలో సుంకాలు విధిస్తే మార్కెట్లో ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉందని అన్నారు.
రష్యాతో యుద్ధం ముగింపు దిశగా మరో అడుగు పడింది. నేడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో సమావేశం కానున్నారు. ఈ మీటింగ్లో జెలెన్స్కీకి మద్దతుగా పలువురు ఐరోపా నేతలు కూడా పాల్గొంటారు.
అమెరికా భారత్ మధ్య ఆగస్టు 25న జరగాల్సిన వాణిజ్య చర్చలు వాయిదా పడినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. దీంతో, తదుపరి ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ పతాకస్థాయికి చేరుకుంది.
రష్యాతో యుద్ధం ముగింపు దిశగా నిర్మాణాత్మక సహకారం అందించేందుకు తాను సిద్ధమేనని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొన్నారు. ట్రంప్తో చర్చల కోసం సోమవారం తాను అమెరికా వెళ్లనున్నట్టు తెలిపారు.
మరి కాసేట్లో ట్రంప్, పుతిన్ మధ్య చర్చలు ప్రారంభం కానున్నాయి. అయితే, ఈ సమావేశంలో ఉక్రెయిన్పై చర్చ ఉండదని ట్రంప్ స్పష్టం చేశారు. యుద్ధం ముగింపు కోసం పుతిన్ను చర్చలకు కూర్చోబెట్టాలనేదే తన ప్రధాన ఉద్దేశమని ట్రంప్ స్పష్టం చేశారు. యుద్ధం ముగిసే వరకూ ఎలాంటి వాణిజ్య ఒప్పందాలు కూడా ఉండవని పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో భేటీ గురించి కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం పరిష్కారం కోసం ఆగస్టు 15, 2025న అలస్కాలో సమావేశం కానున్నట్లు వెల్లడించారు.
రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులపై పశ్చిమ దేశాలు చేస్తున్న విమర్శలను బ్రిటన్లో భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి తిప్పికొట్టారు. ఏ దేశం కోసం మా ఆర్థిక వ్యవస్థను స్విచ్చాఫ్ చేసుకోవాల్సిన అవసరం లేదని ఘాటుగా సమాధానమిచ్చారు.