Home » Russia-Ukraine war
సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులు చేస్తోందని, ప్రతి రోజూ రష్యా ఎంతో మంది ప్రాణాలు తీస్తోందని జెలెన్స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యా ఉన్మాద చర్య పట్ల ప్రపంచం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించరాదని అన్నారు.
ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న దాడికి భారత్ నిధులు సమకూరుస్తోందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో ఉక్రయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు.
భారత్తో తమ బంధాన్ని తెంచేందుకు చేసే ప్రయత్నాలన్నీ విఫలమవుతాయని రష్యా విదేశాంగ శాఖ తాజాగా పేర్కొంది. ఎన్నో ఒత్తిడుల మధ్య ఈ స్నేహానికి కట్టుబడి ఉన్న భారత్పై ప్రశంసల వర్షం కురిపించింది.
రష్యా తాజాగా సంచలన ప్రకటన చేసింది. ఉక్రెయిన్తో శాంతి చర్చలకు బ్రేకులు పడ్డాయని తెలిపింది. శాంతిస్థాపనకు ఐరోపా దేశాలు అడ్డంకులు సృష్టిస్తున్నాయని ఆరోపించింది. చర్చలకు ద్వారాలు మాత్రం ఇప్పటికీ తెరిచే ఉన్నాయని, శాంతిస్థాపనకు రష్యా ఎల్లప్పుడూ సిద్ధమేనని ప్రభుత్వ ప్రతినిధి పేర్కొన్నారు.
కొందరు భారతీయులు రష్యా ఆర్మీలో చేరి ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో పాల్గొంటున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. రష్యా ఆఫర్లు అందుకుని, ఆ దేశ సైన్యంలో చేరడం ప్రమాదకరమని హెచ్చరించింది.
కీవ్ మంత్రిమండలి భవంతి పైకప్పు నుంచి పొగలు రావడం కనిపించాయని, అయితే క్షిపణులు తాకడం వల్లే ఈ పొగలు వచ్చాయా అనేది తెలియాల్సి ఉందని కథనాలు వెలువడ్డాయి. ఉక్రెయిన్ క్యాబినెట్ బిల్డింగ్పై దాడి జరిగినట్టు కీవ్ ప్రతినిధి ధ్రువీకరించారు.
ఉక్రెయిన్కు రష్యా ఊహించని షాకిచ్చింది. భారీ యుద్ధనౌకను సముద్ర డ్రోన్ ప్రయోగించి కూల్చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
శ్వేత సౌధం సలహాదారు పీటర్ నవారో భారత్పై మరోసారి తన అక్కసు వెళ్ళగక్కారు. ఉక్రెయిన్ యుద్ధం కొనసాగడానికి కారణం భారత్ చేపడుతున్న రష్యా చమురు కొనుగోళ్లేనని అన్నారు. ఈ ఘర్షణలను మోదీ యుద్ధం అంటూ సంచలన కామెంట్స్ చేశారు.
త్వరలో పుతిన్, జెలెన్స్కీ భేటీ ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని అన్నారు. శాంతి స్థాపన దిశగా ఇది తొలి అడుగని కూడా వ్యాఖ్యానించారు.
రష్యా చమురును కొనుగోలు చేస్తున్న చైనాను వదిలిపెట్టి భారత్పై సుంకాల వడ్డనకు కారణాలను అమెరికా విదేశాంగ శాఖ మంత్రి తాజాగా వివరించారు. రష్యా చమురులో అధిక శాతాన్ని చైనా శుద్ధి చేసి మళ్లీ ఎగుమతి చేస్తోందని, ఈ దశలో సుంకాలు విధిస్తే మార్కెట్లో ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉందని అన్నారు.