Home » Revanth
గత ప్రభుత్వ హయాంలో నీటి ప్రాజెక్టుల పేరుతో బీఆర్ఎస్ నేతలు వేల కోట్ల కమీషన్లు కొల్లగొట్టారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. కమీషన్లు దండుకొని ఒక్క ఎకరానికీ నీరు అందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. రైతుల పేరుతో రాజకీయాలు చేయడం మానుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచించారు.
హరీష్రావుతో రాజకీయంగా ప్రమాదం ఉందని కేటీఆర్ గుర్తించారని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ అన్నారు. సీఎల్పీ మీడియా హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన బీఆర్ఎస్, బీజేపీ నాయకత్వాలపై విమర్శలు గుప్పించారు.
పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యక్రమాల్లో తనతో సహా ఎవరికీ మినహాయింపు లేదన్నారు. పది రోజులకు ఒకసారి కార్యకర్తలను కలుస్తానని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రంలో ఉపాధ్యాయులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది వేతనాలు మార్కెట్ ప్రమాణాల కంటే చాలా ఎక్కువగా ఉన్నాయని ఆయన చేసిన సూచనలపై ఉపాధ్యాయ సంఘాలు భగ్గుమన్న సంగతి తెలిసిందే.
నేటి డిజిటల్ యుగంలో ఉద్యోగాల వేట సులభతరమైనప్పటికీ, సరైన అవకాశాన్ని, సరైన సమయంలో అందుకోవడం ఇప్పటికీ నిరుద్యోగులకు ఒక పెద్ద సవాలుగానే ఉంది. నిరుద్యోగ యువతకు, ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థలకు మధ్య వారధిగా నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక అద్భుతమైన డిజిటల్ ప్లాట్ఫారమ్ను అందుబాటులోకి తెచ్చింది. అదే 'డీట్' (DEET).
టీజీఎస్ఆర్టీసీ సమ్మెకు శనివారం శుభం కార్డు పడింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రుల ఉప సంఘంతో ఆర్టీసీ జేఏసీ నేతలు జరిపిన చర్చలు సఫలం అయ్యాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి విందు ఇవ్వడంపై కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ స్పందించారు. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమం రాజకీయపరంగా కాకుండా పరిపాలనా అవసరాల దృష్ట్యా జరిగిందని ఆయన తెలిపారు. అనవసరంగా ట్రోల్ చేయవద్దని పేర్కొన్నారు.
దేశానికి గాంధీ, అంబేడ్కర్ రెండు కళ్లని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో మహాత్మా గాంధీ పాత్ర ఎంత ఉందో.. దేశాభివృద్ధిలో అంబేడ్కర్ పాత్ర అంతే ఉందన్నారు.