Home » Raptadu
రాజకీయాలకు అతీ తంగా సీఎం సహాయనిధి ద్వారా పేద వర్గాలను ఆదుకుంటున్న ప్రభు త్వం తమదని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. అనంతపురంలోని ఆమె క్యాంప్ కార్యాలయంలో శనివారం రాప్తాడు నియోజకవర్గంలోని నలుగురికి సీఎం సహాయ నిధి ద్వారా రూ.9.70 లక్షల చెక్కులను ఎమ్మె ల్యే అందజేశారు.
రాప్తాడు నియోజక వర్గంలో రోడ్ల సమస్య లు లేకుండా చేస్తామని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. ఆమె గురువారం టీడీపీ ధర్మవరం నియోజకవర్గం ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ తో కలిసి మండలంలోని ముత్యాలంపల్లి నుంచి వెంకటాపురం వరకు జరుగుతున్న రోడ్డు పనులను పరిశీలించారు,.
అంగనవాడీల సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలుగునాడు అంగనవాడీ ట్రేడ్ యూనియన (టీఎనఏటీయూ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గడ్డం అనంతలక్ష్మి, కె.లక్ష్మీనరసమ్మ పేర్కొన్నారు. స్థానిక ఐసీడీఎస్ కార్యా లయంలో బుధవారం యూనియన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వ హించారు.
ప్రతి పాఠశాలలో తప్పని సరిగా మౌలిక వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యా శాఖాధికారులకు ఎమ్మెల్యే పరిటాల సునీత సూచించారు. ఆమె మంగళ వారం నగరంలోని తన క్యాంప్ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా విద్యాశాఖ అధికారులు, అడిషనల్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్, సమగ్ర శిక్ష, సమగ్ర శిక్ష ఇంజనీరింగ్ అధికారులు, నియోజకవర్గంలోని ఆరు మండలాల విద్యా శాఖ అధికారులతో సమీక్షించారు.
పీఏబీఆర్ కుడి కాలువ కింద నిర్దేశించిన అన్ని చెరువులకు నీరు అందించాల్సిందేనని ఎమ్మెల్యే పరి టా ల సునీత ఇరిగేషన అధికారులను ఆదేశించారు. మండలంలో ని గోళ్లపల్లి సమీపంలో పీఏబీఆర్ కుడి కాలువలో ప్రవహిస్తున్న నీటిని రైతులతో కలిసి ఎమ్మెల్యే సోమవారం పరిశీలించారు.
మండలంలోని మరూరు సబ్ స్టేషన సమీపంలోని అంగనవాడీ కేంద్రం వద్ద నుంచి వాల్మీకి విగ్రహం వరకు ఇళ్లలోని వ్యర్థపు నీరు రోడ్డుపైనే ప్రవహిస్తోంది. బీసీ కాలనీలో మురగు నీరు ప్రవహించే కాలువలు లేక పోవడంతో ఇళ్ల లోని వ్యర్థపు నీరు, కొళాయిల నుంచి వృథా అయ్యే నీరు రోడ్డుపైనే నిరం తరం ప్రవ హిస్తోంది.
మండలంలోని బండమీదపల్లి నుం చి పాలబావికి వెళ్లే మట్టి రోడ్డు చాలా అధ్వానంగా ఉంది. రోడ్డు మొ త్తం రాళ్లు తేలి గుంతలమయమైంది. దీంతో బండమీదపల్లి నుంచి పాల బావి కి వెళ్లే వాహనదారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మండల కేంద్రంలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో 1988-89 పదోతరగతి చదివిన పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పటి ఉపాధ్యాయులు సావిత్రమ్మ, రామాంజనేయులురెడ్డిని ఘనంగా సన్మానించారు.
ఎమ్మెల్యేగా ఉన్న లేకున్నా పరి టాల రవీంద్ర భార్యగా ఈ ప్రాంతానికి సేవ చేస్తానని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. శనివారం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథ కాన్ని రామగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యే ప్రారం భించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ...కరువు ప్రాంతమైన ఉమ్మడి అనంత జిల్లాకు డొక్కాసీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఓ వరంలాంటి దన్నారు.
మండల పరిధిలోని అనంతపురం - కళ్యాణదుర్గం రోడ్డు నుంచి నూతనంగా తలుపూరు గ్రామానికి చేపట్టిన తారురోడ్డు పనులు వేగంగా జరుగుతున్నాయి మండలంలో అతి వేగంగా పూర్తికానున్న తారురోడ్డ కావడంతో మండల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.