Home » Rajastan Royals
నేడు ఐపీఎల్ 2024లో 38వ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరగనుంది. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు జరగనుంది. ఈ సీజన్లో పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ జట్టు మొదటి స్థానంలో ఉండగా, ముంబై ఇండియన్స్ జట్టు ఆరో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు మ్యాచులో ఏ జట్టు గెలుస్తుందో ఇప్పుడు చుద్దాం.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ipl 2024) 27వ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్(Punjab Kings)పై రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) చివరి ఓవర్లో ఉత్కంఠ విజయం సాధించింది. ఆ క్రమంలో పంజాబ్ ఫ్రాంచైజీ సహ యజమాని ప్రీతి జింటా(Preity Zinta) స్టేడియంలో చేసిన రియాక్షన్ చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతున్నాయి.
నేడు ఐపీఎల్ 2024(IPL 2024)లో 27వ మ్యాచ్ పంజాబ్ కింగ్స్(Punjab Kings), రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) జట్ల మధ్య జరగనుంది. ప్రస్తుతం శిఖర్ ధావన్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ జట్టు పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ జట్టు నంబర్ వన్ స్థానంలో ఉంది. అయితే నేడు జరిగే మ్యాచులో ఏ జట్టు గెలిచే అవకాశం ఉందో ఇప్పుడు చుద్దాం.
ఐపీఎల్ 2024(IPL 2024)లో నిన్న జరిగిన RR vs RCB మ్యాచులో విరాట్ కోహ్లీ(Virat Kohli) సెంచరీ చేసినా కూడా RCB ఓటమి చెందింది. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ 72 బంతుల్లో 113 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో సెల్ఫీష్ కోహ్లీ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు. ఈ క్రమంలో విరాట్ బ్యాటింగ్ గురించి భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) స్పందించారు.
ఐపీఎల్ 2024(IPL 2024)లో నిన్న రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals)తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ సెంచరీ చేసినా కూడా royal challengers bangalore జట్టుకు ఓటమి తప్పలేదు. దీంతో ఈ సీజన్లో ఆర్సీబీ(RCB) నాలుగో మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. అయితే ఈ మ్యాచులో ఆర్సీబీ ఓటమికి ప్రధానంగా గల కారణాలను ఇప్పుడు చుద్దాం.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. దీంతో బెంగళూరు ముందుగా బ్యాటింగ్ చేయనుంది.
ఈరోజు IPL 2024 19వ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగనుంది. సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్లో రాజస్థాన్ వరుస విజయాలను అడ్డుకోవాలని ఆర్సీబీ భావిస్తోంది. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ రాజస్థాన్ విజయం సాధించింది. అదే సమయంలో RCB ఆడిన నాలుగు మ్యాచ్ల్లో ఒక్క విజయం మాత్రమే సాధించింది.
ఐపీఎల్ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు చెలరేగారు. ట్రెంట్ బౌల్ట్(3/22), యజుర్వేంద్ర చాహల్(3/11) నిప్పులు చెరిగే బంతులకు ముంబై బ్యాటర్ల వద్ద సమాధానమే లేకపోయింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ ముందు ముంబై ఇండియన్స్ జట్టు 126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది.
ఐపీఎల్ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ నిప్పులు చెరిగాడు. తన పేస్ పదునుతో ఏకంగా ముగ్గురు ముంబై బ్యాటర్లను గోల్డెన్ డకౌట్ చేశాడు. అది కూడా 4 బంతుల వ్యవధిలోనే కావడం గమనార్హం.
ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా కాయిన్ వేయగా రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ హెడ్స్ చెప్పాడు. కాయిన్ కూడా హెడ్స్ పడింది. టాస్ గెలిచిన శాంసన్ ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు.