Home » Raghu Rama Krishnam Raju
నరసాపురం సిటింగ్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఈసారి టీడీపీ నుంచి పోటీ చేయబోతున్నారు. మంగళవారం రాత్రి ఆయన హైదరాబాద్లో చంద్రబాబుతో భేటీ సందర్భంగా ఈ నిర్ణయం జరిగినట్లు సమాచారం..
ఈ ఎన్నికల్లో లోక్సభ అభ్యర్థిగా కె. రఘురామకృష్ణరాజుకు సీటు కేటాయించేందుకు తీవ్ర కసరత్తు జరుగుతోన్నట్లు రాజకీయ వర్గాల్లో ఓ చర్చ అయితే వైరల్ అవుతోంది. అందుకోసం అటు బీజేపీ, ఇటు టీడీపీ, మరోవైపు జనసేన చర్చకు తెర తీసినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి వైఎస్ జగన్పై నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ ఎన్నో కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని స్పష్టం చేశారు. హైదరాబాద్లో గల సీబీఐ కోర్టులో అన్నీ కేసులకు సంబంధించి 3 వేల వాయిదాలు తీసుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఆ అంశానికి సంబంధించి తాను రెండు పిటిషన్లు దాఖలు చేశానని గురువారం నాడు భీమవరంలో రఘురామ వివరించారు.
Narasapuram MP Candidate: నరసాపురం నుంచి కూటమి తరఫున భూపతిరాజు శ్రీనివాసవర్మను బీజేపీ ప్రకటించింది. ఇంతకీ ఎవరీ వర్మ..? రఘురామకృష్ణం రాజును ఎందుకు కూటమి వద్దనుకుంది..? తెరవెనుక ఏం జరిగింది..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..