Share News

TDP: జగన్ ఓడి.. చంద్రబాబు సీఎం అవుతారు: రఘురామ

ABN , Publish Date - Apr 14 , 2024 | 03:02 PM

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం వెలివర్రు వీర పేరంటాలమ్మ వారిని ఎంపీ రఘురామ(Rahu rama Krishna Raju) ఆదివారం దర్శించుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

TDP: జగన్ ఓడి.. చంద్రబాబు సీఎం అవుతారు: రఘురామ

ప.గో: పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం వెలివర్రు వీర పేరంటాలమ్మ వారిని ఎంపీ రఘురామ(Rahu rama Krishna Raju) ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

"టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu Naidu) ముఖ్యమంత్రి కావాలి. సీఎం జగన్ ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోవాలి. గతంలో పేరంటాలమ్మ ఆలయంలో మొక్కలు నాటాం. అవి ప్రస్తుతం వృక్షాలుగా మారి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఈ ఆలయానికి జగన్(CM Jagan) ఎన్నడూ రాకూడదని కోరుకుంటున్నా. ఆయన అడుగుపెట్టిన ప్రతీ చోట చెట్లు నరుక్కుంటూ పోతున్నారు. అలాంటి వారిని చెట్లకు దూరంగా ఉంచాలి. రానున్న ఎన్నికల్లో జగన్‌ను ఓడించి.. ఇంటికి పంపిస్తాం. సోమవారం సాయంత్రానికిల్లా పోటీ ఎంపీగానా,ఎమ్మెల్యేగానా అనేది స్పష్టత వస్తుంది. ఈ నెల 22న నామినేషన్ దాఖలు చేస్తా. నామినేషన్ వేసేది అసెంబ్లీకా, లోక్ సభకా అనేది 2 రోజుల్లో క్లారిటీ వస్తుంది. నామినేషన్ సమయంలో భారీ సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు పాల్గొంటారు" అని రఘురామ పేర్కొన్నారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 14 , 2024 | 03:37 PM