Home » Punjab
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, గురుప్రీత్ కౌర్ దంపతుల ఇంట మహాలక్ష్మి జన్మించింది. వారికి గురువారం పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఈ విషయాన్ని సీఎం మాన్ తన ఎక్స్ అకౌంట్లో పంచుకున్నాడు.
లోక్ సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో నకిలీ మద్యం మరణాలు పంజాబ్ నే కాదు.. యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. పంజాబ్ ( Punjab ) లోని సంగ్రూర్లో నకిలీ మద్యం ఘటనలో మృతుల సంఖ్య 20కి చేరింది. సంగ్రూర్ సమీపంలోని దిర్బా గుజ్రాన్ గ్రామంలో నకిలీ మద్యం సేవించడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.
అమెరికాలో భారత మాజీ రాయబారి తరణ్జిత్ సింగ్ సంధు మంగళవారంనాడు అధికారికంగా బీజేపీలో చేరారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శులు వినోద్ తావ్డే, తరుణ్ చుగ్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు.
దివంగత పంజాబీ సింగర్, ర్యాపర్ సిద్ధూ మూసేవాలా(Sidhu Moose Wala) ఫ్యామిలీ(family) మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా ఆయన తల్లి చరణ్ కౌర్(58) ఆదివారం తన రెండవ బిడ్డకు జన్మనిచ్చింది.
ఈరోజు రైల్ రోకో ఉద్యమానికి రైతులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో పంజాబ్-హర్యానా రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో రైతులు రైలు పట్టాలపై కూర్చొని నిరసనలు తెలుపనున్నారు. దాదాపు నాలుగు గంటలపాటు ఈ నిరసన చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో పలు ట్రైన్స్ రాకపోకలకు అంతరాయం ఏర్పడనుంది.
కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ గతంలో ఒకసారి తనను కలిశారని వివరించారు. తనతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి కనబరిచారని సిద్దూ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరతానని, తన డిప్యూటీగా పనిచేస్తానని చెప్పారని హాట్ కామెంట్స్ చేశారు.
ఒకటి కాదు, రెండు కాదు, జమ్మూకశ్మీర్ నుంచి పంజాబ్ వరకూ ఏకంగా 70 కిలోమీటర్లు డ్రైవర్ లేకుండా గూడ్సు రైలు దూసుకెళ్లి జనం గుండెల్లో గుబులెత్తించింది. రాళ్ల లోడుతో వెళ్తూ 5 రైల్వే స్టేషన్లను దాటేసింది. అదృష్టం బాగుండి ఆ మార్గంలో ఇతర రైళ్లు కానీ, క్రాసింగ్లు కానీ లేకపోవడం, పట్టాలు తప్పకుండా ప్రయాణించడంతో భారీ ప్రమాదమే తప్పింది. దీంతో రైల్వే శాఖ అధికారులు తేలిగ్గా ఊపిరిపీల్చుకున్నారు. తక్షణమే దర్యాప్తు చేపట్టారు.
పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో రైతు ఉద్యమం 12వ రోజుకు చేరింది. శంభు బార్డర్లో రైతుల ఆందోళన కొనసాగుతోంది. ఫిబ్రవరి 29 వరకూ ఢిల్లీ ఛలో ఆందోళనకు రైతులు విరామం ఇచ్చారు. అప్పటి వరకూ నిరసన శిబిరాల వద్దనే ఆందోళనలు నిర్వహిస్తున్నారు. నేడు క్యాండిల్ మార్చ్, ఫిబ్రవరి 26న కేంద్రం దిష్టిబొమ్మను దహనం చేస్తామని ప్రకటించింది.
యునైటెడ్ కిసాన్ మోర్చా 'ఢిల్లీ చలో(Delhi Chalo)' మార్చ్ను ఫిబ్రవరి 29కి వాయిదా వేసింది. ఫిబ్రవరి 29న ఉద్యమంపై తదుపరి నిర్ణయం తీసుకుంటామని రైతు సంఘం నాయకుడు సర్బన్ సింగ్ పంధేర్ తెలిపారు.
తమ డిమాండ్ల సాధన కోసం శంభు సరిహద్దులో బుల్డోజర్ లతో రైతులు నిరసన చేపట్టారు. కంచెలు తెంచేసి దేశ రాజధాని వైపు తరలివచ్చేందుకు పక్కా ప్రణాళికలు వేసుకుంటున్నారు.