Home » Pulivendla
తన కంచుకోట అనే చెప్పుకునే జగన్ కు అక్కడి ప్రజలకు ఊహించని షాక్ ఇచ్చారు. పులివెందులలో జరిగిన జడ్పీటీసీ ఉప ఎన్నికలలో జగన్ బై చెప్పి.. టీడీపీకి జై కొట్టారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని తెలుగుదేశం నేతలు బుధవారం కలిశారు. పులివెందుల, ఒంటిమిట్టలో అరాచకాలకు పాల్పడిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఏపీ ఎన్నికల కమిషనర్ను మండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, విద్య మౌలిక వసతుల కమిటీ ఛైర్మన్ రాజశేఖర్ కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు.
ఉమ్మడి కడప జిల్లాలో మంగళవారం పులివెందుల, ఒంటిమిట్ట రెండు స్థానాల్లో జడ్పీటీసీ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికల పోలింగ్ ఇవాళ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం ఐదు గంటల వరకు బ్యాలెట్ విధానంలో ఓటింగ్ జరుగనుంది.
సార్వత్రిక ఎన్నికల తర్వాత జిల్లాలో జరుగుతున్న పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. రెండు చోట్ల, టీడీపీ, వైసీపీ నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి.
వైసీపీ నేతలు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, సతీష్ రెడ్డిలపై పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. అవినాష్, సతీష్లు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి అనుమతి లేకుండా అధిక సంఖ్యలో కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారని ఎంపీడీవోకు కొంతమంది ఫిర్యాదు చేశారు.
రాష్ట్రంలో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారంలో ఉంది. ప్రభుత్వం వచ్చి ఏడాది దాటింది. అయితే, పులివెందుల పోలీసులు మాత్రం ఇంకా జగన్ ప్రభుత్వమే ఉందన్న భ్రమలో ఉన్నట్టు కనిపిస్తోంది.
వైఎస్సార్ షర్మిల పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ రాజారెడ్డి శతజయంతి సందర్భంగా అరుదైన ధైర్యం, సాహసం, పట్టుదలను గుర్తు చేస్తూ ఆయన సమాధి వద్ద తల్లి విజయలక్ష్మితో కలిసి నివాళులు అర్పించారు. అనంతరం పులివెందులలోని చర్చి వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
జగన్ అడ్డాలో పాగా వేసేందుకు టీడీపీ పావులు కదుపుతోందా. కడప అసెంబ్లీలో గెలుపు తర్వాత టీడీపీ పులివెందులను టార్గెట్ చేసిందా.. వచ్చే ఎన్నికల్లో జగన్ను ఓడించడమే లక్ష్యమా.. టీడీపీ మహానాడు పులివెందులలో పెట్టడం ద్వారా ఎలాంటి టీడీపీ వైసీపీకి ఎలాంటి సంకేతాలు ఇవ్వబోతుంది.
YS Jagan:పులివెందులలో వైఎస్ జగన్కు చెక్ పెట్టేలా తెలుగుదేశం పార్టీ మాస్టర్ ప్లాన్ వేసింది. ప్రజల్లో బలం ఉన్న వైసీపీ నేతలను టీడీపీలో చేర్చుకోవడం ద్వారా వైసీపీని ఢీకొట్టేలా పావులు కదుపుతోంది.
అనారోగ్యంతో మరణించిన వైఎస్ అభిషేక్రెడ్డి భౌతికకాయం వద్ద మాజీ సీఎం జగన్ దంపతులు నివాళులు అర్పించారు.