Home » Priyanka Gandhi
Telangana: హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఇందులో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు పాల్గొని ప్రసంగించారు. హుస్నాబాద్ అంటే కేసీఆర్కు చాలా ఇష్టమని.. సెంటిమెంట్ ఉన్న ప్రాంతమని అన్నారు. వికాసం కావాలంటే వినోద్ అన్న గెలువాలని.. విధ్యంసం కావాలంటే కాంగ్రెస్, బీజేపీ గెలవాలంటూ వ్యాఖ్యలు చేశారు.
దేశంలో ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికలు మోదీ చేజారిపోతున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు.
ప్రధాని మోదీ తన పదేళ్ల హయాంలో ఒక్క పథకాన్నైనా ప్రారంభించారా, ఒక్క సంస్థనైనా నెలకొల్పారా అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కోసం రాయ్బరేలీ మరోసారి సిద్దమవుతుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు. ఈ నియోజకవర్గంతో పార్టీకి శతాబ్దం అనుబంధం ఉందని తెలిపారు.
దేశంలో ఇప్పుడు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు రాహుల్గాంధీకి అగ్నిపరీక్షగా మారాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దేశ వ్యాప్తంగా ఇండియా కూటమి తమ ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటించనప్పటికీ.. కాంగ్రెస్ నాయకులు ఎక్కువమంది రాహుల్ ప్రధాని కావాలంటే కాంగ్రెస్ను గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు. ప్రధానంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే రాహుల్ ప్రధాని కావాలంటే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
దేశ ప్రధాని ఎవరుండాలనే ప్రాతిపదికన సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్డీయే, ఇండియా కూటములు అధికారం కోసం ప్రయత్నిస్తున్నాయి. మాదంటే.. మాదంటూ ఎవరికి వాళ్లు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా.. యూపీలో మెజార్టీ సీట్లు గెలవాలి. ఏ పార్టీ ఉత్తరప్రదేశ్లో సత్తా చాటితే ఆ పార్టీనే గెలుపునకు దగ్గరవుతుంది. యూపీలో మొత్తం 80 లోక్సభ స్థానాలున్నాయి. మరోవైపు ఉత్తరప్రదేశ్లో అమేథి, రాయ్బరేలీ సీట్లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
తెలంగాణలో ఎన్నికల ప్రచారంపైన కాంగ్రెస్ అధిష్ఠానం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఇప్పటికే తుక్కుగూడ, నిర్మల్, ఆలంపూర్ జనజాతర సభల్లో పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేసిన ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ.. ఈ నెల 9న మరో రెండు సభల్లోనూ
కాంగ్రెస్ కంచుకోటగా పేరున్న రాయ్బరేలీ, అమేఠీల్లో ఎన్నికల ప్రచారానికి ఆ పార్టీ నాయకురాలు ప్రియాంక నేతృత్వం వహించనున్నారు.
కాంగ్రెస్ నేత, తన సోదరుడు రాహుల్ గాంధీని ఉద్దేశించి ‘యువరాజు’ అంటూ ప్రధాని మోదీ ఎద్దేవా పట్ల కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా ధీటైన జవాబిచ్చారు.
లోక్సభ ఎన్నికల్లోలో రాయబరేలి నియోజకవర్గాన్ని రాహుల్ గాంధీ ఎన్నుకోవడంపై ఆ పార్టీ బహిష్కృత నేత ఆచార్య ప్రమోద్ కృష్ణం సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోని రాహుల్ గాంధీ వర్గం, ప్రియాంక వర్గంగా కాంగ్రెస్ పార్టీ చీలిపోనుందని జోస్యం చెప్పారు. పార్టీలో జరుగుతున్న 'కుట్రలో బాధితురాలు ప్రియాంక అని వ్యాఖ్యానించారు.