Home » Ponnam Prabhakar
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో త్వరలో జరగబోయే ఉప ఎన్నిక టికెట్టును స్థానికులకే కేటాయించనున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆశావాహులంతా కలిసి నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటారని అన్నారు. జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 5లోని ఓ హోటల్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎరువుల కేటాయింపులో తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎరువులను దాచిపెడుతోందన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎరువుల గురించి తమ ప్రభుత్వంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎరువులు వచ్చిన స్టాక్ ఎంత.. సరఫరా ఎంత రావాల్సిందో ముందు తెలుసుకోవాలని సూచించారు. రామచంద్రరావు వెంటనే ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే ప్రయత్నం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు
బీసీల నోటి కాడి బువ్వను బీజేపీ నేతలు తన్నే కుట్రలు చేస్తున్నారని మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి దుయ్యబట్టారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి బీసీ వ్యతిరేకి అని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఫ్యూడలిస్టు అని మండిపడ్డారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే ‘మహాలక్ష్మి’ పథకంతో ఆర్టీసీ ఆర్థికంగా బలోపేతమవుతోందని.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.
రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో భారీ వర్షాలు కురుస్తోండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ సందర్భంగా అధికారులతో హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ఈ క్రమంలో అధికారులకి కీలక ఆదేశాలు జారీ చేశారు.
బోనాలు తెలంగాణ సంస్కృతిలో అనాదిగా కొనసాగుతూ వస్తున్నాయని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. గోల్కొండలో మొదలైన ఉత్సవాలు, సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల వరకు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. ఆదివారం లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారిని మల్లు భట్టి విక్రమార్క దర్శించుకున్నారు.
భాగ్యనగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు సంబంధింత అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
పర్యావరణ పరిరక్షణ, ప్రజల ఆరోగ్య సంరక్షణను కూడా మానవసేవగా పరిగణిస్తారని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు.
అగ్రవర్ణాల్లో ఉన్న పేదల కోసం తీసుకువచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో 50 శాతం కోటా పరిమితిని ఎత్తేసినప్పుడు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం కోసం ఎందుకు ఎత్తేయరు