Home » Ponnam Prabhakar
రాబోయే 2027 గోదావరి పుష్కరాల కోసం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. నాలుగు జిల్లా కేంద్రాలకు ఫోర్లైన్స్ రోడ్డు ఉన్న హుస్నాబాద్ను మరింత అభివృద్ధి చేస్తున్నామని.. డ్రైనేజీ సిస్టమ్ అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.
కోటి మంది మహిళలను కోటిశ్వరులుగా చేసేంత వరకు తమ ప్రభుత్వం విశ్రమించేది లేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. మహిళలు ఏది కోరుకున్నా నెరవేర్చడానికి సోదరుడిగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నానని తెలిపారు....
ప్రయాణికుల భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సోమవారం సచివాలయంలో రవాణా శాఖ ఉన్నతాధికారులతో మంత్రి పొన్నం సమీక్ష నిర్వహించారు.
అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ నంబర్ 3 ద్వారా తెలంగాణ ఏర్పాటైందని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి రాజకీయ పార్టీలకు అతీతంగా కృషి చేయాలని ఆకాంక్షించారు. త్వరలోనే తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారిని గౌరవిస్తామని మాటిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకే అందేలా చూడడంతో పాటు ఇప్పటికే అందుతున్న పథకాల్లో అనర్హులుంటే.. వారిని తప్పించేందుకు సర్కారు సన్నద్ధమైంది. సంక్షేమ పథకాల అమలులో పూర్తి పారదర్శకత ఉండేలా పటిష్ఠ .....
హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రోటోకాల్ అంశంపై కాంగ్రెస్ నేతలు ఫిరోజ్ఖాన్, ఉస్మాన్ మధ్య వాగ్వాదం ఘర్షణకు దారితీసింది.
కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ కేసులో బాధితురాలికి న్యాయం చేయాలని మాత్రమే తాను మాట్లాడానని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ కేసులో బాధితురాలికి న్యాయం చేసే అంశంపైనే తాను మాట్లాడానని.. తన మాటలను కొంతమంది వక్రీకరించారని పేర్కొన్నారు.
తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ వాఖ్యలను టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఖండించారు. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ కేసు వ్యవహారంలో మంత్రి పొన్నం చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని స్పష్టం చేశారు.
తెలంగాణ రవాణా శాఖ పనితీరును కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రశంసించారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్కు కేంద్ర మంత్రి అభినందనలు తెలిపారు. మంత్రి పొన్న ప్రభాకర్ని ప్రశంసిస్తూ నితిన్ గడ్గరీ గురువారం లేఖ రాశారు.
ఆర్టీసీ అధికారులు.. కిందిస్థాయి సిబ్బంది, ప్రయాణికుల విషయంలో సానుకూలంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సిబ్బందిని వేధింపులకు గురిచేయకుండా ప్రేమతో, సానుకూల దృక్పథంతో పనులు చేయించాలని డివిజన్ స్థాయి అధికారులకు సూచించారు.