Home » Ponnam Prabhakar
రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఉద్యోగుల పెండింగ్ సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు
దుబాయ్లో పని చేస్తున్న హుస్నాబాద్కు చెందిన చొప్పరి లింగయ్య ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతూ, మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో స్వదేశానికి చేరుకున్నాడు. లింగయ్యకు విమాన టికెట్ను ఏర్పాటు చేసి, ఆయనను హుస్నాబాద్కు తీసుకురావడం కోసం మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన కృషి ప్రశంసనీయమైంది
మంత్రి పొన్నం ప్రభాకర్ బేగంపేటలో జరిగిన కార్యక్రమంలో, ఇంటర్ బీసీ గురుకుల, హాస్టల్ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేశారు. 162 మంది విద్యార్థులకు రూ. 10 వేల నగదు ప్రోత్సాహం అందించారు, తద్వారా వారికి ప్రోత్సాహాన్ని ఇచ్చి మంచి భవిష్యత్తు సాధించాలన్న ఆకాంక్షతో మార్గనిర్దేశం చేశారు
Minister Ponnam Prabhakar: భారత్ సమ్మిట్ హైదరాబాద్ ఇమేజ్ పెంచుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. పెట్టుబడులకు, ఇండస్ట్రియల్ రంగానికి హైదరాబాద్ ఎలా ఉపయోగపడుతుందో భారత్ సదస్సు డిక్లరేషన్లో ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి లైఫ్ సైన్సెస్, టూరిజం, ఐటీ వంటి రంగాలు ఎంతో అనుకూలమని, విదేశీ ప్రతినిధులు తమ దేశాలు, సంస్థల ద్వారా తెలంగాణలో పెట్టుబడులు పెట్టించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.
Minister Ponnam Prabhakar: భూ భారతి చట్టంతో రైతులకు న్యాయం జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. భూమి రక్షణ కోసం ఈ చట్టాన్ని తీసుకువచ్చామని అన్నారు. త్వరలోనే గౌరవెల్లి కాల్వల నిర్మాణం పూర్తవుతుందని.. ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
ఇంటర్ విద్యార్థులు ఫలితాల్లో అదరగొట్టారు. గత ఐదేళ్లతో పోలిస్తే ఈసారి అత్యధిక ఉత్తీర్ణత నమోదు చేశారు. అందులోనూ అమ్మాయిలు ముందంజలో నిలిచారు.
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదల అయ్యాయి. ఇంటర్ ఫస్ట్..సెకండ్ ఈయర్ ఫలితాలను రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు.
తెలంగాణ ఆర్టీసీలో 3,038 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది. ఎస్సీ వర్గీకరణ పూర్తితో నియామకాలకు మార్గం సుగమమైంది; నిరుద్యోగులకు ఇది మంచి అవకాశమని మంత్రి ప్రకటించారు
Ponnam Prabhakar: తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకు రేవంత్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆర్టీసీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ ప్రకటన విడుదల చేశారు.