Home » Ponguleti Srinivasa Reddy
ఫోన్ ట్యాపింగ్పై మరో సారి దుమారం రేగింది. ముగ్గురు మంత్రుల ఫోన్లను సీఎం రేవంత్రెడ్డి ట్యాప్ చేయిస్తున్నారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను భట్టి విక్రమార్క, ఉత్తమ్, పొంగులేటి ఖండించారు.
కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.
గత కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయాలు తెలంగాణ రాష్ట్రానికి భారంగా మారాయని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. కేసీఆర్ పాలనలో చేసిన తప్పిదాలకు నేడు తమ ప్రభుత్వం మూల్యం చెల్లిస్తోందని అన్నారు. గతంలో శ్రీశైలంపైన ఏపీ ప్రభుత్వం ప్రాజెక్ట్లు కడుతుంటే అడ్డుకోకుండా కేసీఆర్ ప్రభుత్వం సహకరించిందని మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు.
రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 3.54 లక్షల మందికి రేషన్ కార్డులను అందిస్తున్నామని, సోమవారం సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక గ్రామ పాలనాధికారి (జీపీవో)ని నియమిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.
రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో అమలులో ఉన్న పంచాయతీరాజ్ చట్టం-2018ను సవరించి, ఆర్డినెన్స్ను తేవడం ద్వారా ఈ రిజర్వేషన్లను వర్తింపజేస్తారు.
పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చిన మాజీ సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత పదేళ్లలో 2 వేల కోట్లతో ప్రగతి భవన్ నిర్మించుకొని విలాసవంతమైన జీవితం..
రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదలకు 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు.
పదవులు శాశ్వతం కాదని రాష్ట్ర రెవెన్యూ, పౌర సరఫరాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. పదవిలో ఉన్నప్పుడు చేపట్టిన సంస్కరణలు, నిర్ణయాలతో పది మందికి మేలు జరగాలన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళాభ్యుదయం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతోందని, అందులో భాగంగా మహిళలకు స్టాంప్ డ్యూటీ తగ్గించాలని ఆలోచన చేస్తున్నామని రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.