Home » Politicians
రాష్ట్ర చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణం, చార్మినార్ను తొలగించడం అంటే.. తెలంగాణ చరిత్రను చెరిపేయడమేనని, నాలుగు కోట్ల మంది గుండెలను గాయపరచడమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
‘‘మమ్మల్ని ద్వేషించేవాళ్లు ఆ కొందరినే ఎందుకు ఇష్టపడతారు!? అక్కడి (పాకిస్థాన్) నుంచి వారికే ఎందుకు మద్దతు లభిస్తుంది!? ఈ అంశంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరగాలి’’ అని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ను ఉద్దేశించి ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
బీజేపీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతుందంటున్నారని... మరి ప్రజల జీవితాల్లో మార్పెందుకు రావడం లేదని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ బీజేపీ నేతలను ప్రశ్నించారు.
సార్వత్రిక ఎన్నికల ఆరో దశ పోలింగ్ శనివారం జరగనుంది. ఈ దశలో బిహార్లోని 8 కీలక పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు మొత్తం 86 మంది పోటీలో ఉన్నారు.
ఓట్ల శాతంపై తుది డేటాను వెంటనే వెల్లడించాల్సిందిగా ఎన్నికల కమిషన్(ఈసీ)ను ఆదేశించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మరో వారం రోజుల్లో ఎన్నికలు ముగుస్తాయని, ఈ మధ్యలో జోక్యం చేసుకోలేమని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీశ్చంద్రతో కూడిన వెకేషన్ బెంచ్ శుక్రవారం స్పష్టంచేసింది.
సార్వత్రిక ఎన్నికల ఆరోదశ పోలింగ్లో భాగంగా శనివారం ఒడిశాలోని ఆరు కీలక పార్లమెంటు స్థానాలకు ఓటింగ్ ప్రక్రియ జరగనుంది. వీటిలో పూరి, భువనేశ్వర్, కటక్, ఢెంకనాల్, శంబల్పూర్, కోంఝార్ నియోజకవర్గాలు ఉన్నాయి.
పరువు నష్టం కేసులో నర్మదా బచావో ఆందోళన్ నాయకురాలు మేధా పాట్కర్ అపరాధి అని శుక్రవారం మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ రాఘవ్ శర్మ ప్రకటించారు.
చంద్రగిరి, సత్తెనపల్లి నియోజకవర్గాల పరిధిలోని వివిధ బూత్ల్లో రీపోలింగ్ నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ వైసీసీ అభ్యర్థులు దాఖలు చేసిన వ్యాజ్యాలను హైకోర్టు కొట్టివేసింది. గురువారం వ్యాజ్యాలు విచారణకు రాగా కేంద్ర ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపించారు.
ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియ్సగా ఉందని, త్వరలోనే అరెస్టు చేసి తీరుతామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్కుమార్ మీనా తెలిపారు. గురువారం మీడియాతో దీనిపై ఆయన మాట్లాడారు.
చిన్నప్పటి నుంచీ అంతా ఒక్కచోట పెరిగారు. సరదాలు, సంబరాల్లో పాలుపంచుకున్నారు. కలసి పండగలు చేసుకున్నారు. సహపంక్తి భోజనాలు చేశారు. గ్రామంలో అందరిదీ ఒకే మాట. చిన్నా పెద్దా అన్న పట్టింపు పెద్దగా ఉండేది కాదు. 35 ఏళ్ల క్రితం ఎన్నికల సందర్భంగా జరిగిన ఓ చిన్న గొడవ ఆ గ్రామాన్ని ఛిన్నభిన్నం చేసింది.