Home » Police Rides
హైదరాబాద్లోని పాతబస్తీలో నేరగాళ్ల గుండెల్లో వణుకు పుట్టిస్తూ పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. చార్మినార్ జోన్ పరిధిలో రౌడీ షీటర్ల కదలికలపై నిఘా ఉంచేందుకు 300 మందికి పైగా పోలీసులు ఈ ఆకస్మిక సోదాలు చేపట్టారు.
ఖమ్మం జిల్లాలో ఐదు కోట్ల రూపాయల విలువైన గంజాయిని తగులబెట్టారు. 47 కేసులలో స్వాధీనం చేసుకున్న గంజాయిని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి ఆదేశాలతో దగ్ధం చేశారు.
నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ ప్రాంతంలో పోలీసులు ఇవాళ విస్తృత దాడులు చేశారు. మావోయిస్టులకు ఆశ్రయం ఇచ్చినట్టు ఆరోపణల నేపథ్యంలో ప్రజా సంఘాల నాయకుల ఇళ్లలో సోదాలు జరిపారు.
ఒకే హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేయవచ్చా.. ఎలాంటి సందర్భంలో వారిని అదుపులోకి తీసుకోవచ్చు.. వాటికి సంబంధించిన నియమ నిబంధనలు ఏం చెబుతున్నాయో ఓసారి తెలుసుకుందాం.
గచ్చిబౌలిలోని కోవ్ స్టేస్ హోటల్లో జరుగుతున్న డ్రగ్స్ పార్టీపై పోలీసుల దాడులు చేశారు. 12 మందిని పట్టుకున్నారు. అయిదుగురు డ్రగ్ తీసుకున్నట్లుగా నిర్ధారణ అయింది. ఈ పార్టీలో పోలీస్ శాఖకు చెందిన అధికార్ని కూడా పోలీసులు గుర్తించారు.
Bengaluru Rave Party Bust: బెంగళూరు సమీపంలోని ఫాంహౌస్లో నిర్వహిస్తున్న రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేశారు. 20 మంది యువకులు, 7 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో చైనా మహిళ కూడా ఉంది.
ఒకే ఏడాదిలో 540 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో హతమవడం, దళపతిని కోల్పోవడం మావోయిస్టు ఉద్యమానికి గట్టి దెబ్బగా మారింది. డ్రోన్ల ఆధారిత సాంకేతిక యుద్ధంతో కేంద్ర బలగాలు ఆధిపత్యం చాటుతున్నాయి.
మాన్సూన్ వర్షాలు కర్రెగుట్టల ప్రాంతంలో ఉన్న నక్సలైట్లను అన్వేషించే బలగాలకు పెద్ద అడ్డంకిగా మారాయి. వర్షాల వల్ల అడవులు దట్టమైపోయాయి, గుట్టల మధ్య పథాలు చిత్తడిగా మారాయి. అయినప్పటికీ, బలగాలు 250 బాంబులను నిర్వీర్యం చేసి, నక్సలైట్లతో ఘనమైన ఎన్కౌంటర్ను నిర్వహించాయి.
మావోయిస్టులు 30 రోజుల పాటు కాల్పులు విరమించి, శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. చర్చలు ప్రారంభించేందుకు ఉమ్మడి కమిటీ ఏర్పాటుకు వారు అంగీకరించారు
బీజేపీ ఎమ్మెల్యేలు హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బయలుదేరి.. హెచ్సీయూ భూముల వద్దకు చేరుకుని అక్కడ బాధిత విద్యార్థులతోపాటుగా హెచ్సీయూ యాజమాన్యం, ప్రభుత్వ పెద్దలతో మాట్లాడేందుకు సమాయత్తమవుతున్న నేపథ్యంలో ఇందుకు అనుమతి లేదంటూ పోలీసులు బీజేపీ నేతలను అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. బీజేపీ ముఖ్యనేతలు బయటకు రాకుండా పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.