Home » PM Modi
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంటోంది. రెండో విడత పోలింగ్కు సోమవారంతో ప్రచారం ముగియనుండటంతో ప్రధాన పార్టీలన్నీ బహిరంగ సభలు, రోడ్షోలతో ఊదరగొడుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారంనాడు వరుస బహిరంగ సభలు, రోడ్షోలతో ప్రచారం సాగించారు.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి పూర్తి అనుకూల పవనాలు వీస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తొలి విడత పోలింగ్లో భారీ ఓటింగ్తో టీఎంసీకి గట్టి దెబ్బ తగిలిందని, తుది విడత ముగిసేసరికి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇద్దరూ అధికారం కోసం ఆరాటపడుతూ పేదలను పట్టించుకోరని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. దేశ సంపదను ధనికులకు దోచుపెడుతున్నారంటూ విమర్శించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్ అగ్రస్థాయి దేశంగా మారుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ రిఫార్మర్, పెర్ఫార్మర్, విన్నర్ అని ప్రశంసించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణలో వచ్చే నెల 9వ తేదీన పర్యటించనున్నారు. ప్రధాని పర్యటనలో భాగంగా సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ నిర్వహించే అవకాశం ఉంది.
మహిళలకు 33 శాతం రిజర్వేషన్ను 2029 ఎన్నికల నుంచే అమలు చేసేలా ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. 25 ఏళ్లుగా ఈ బిల్లును అడ్డుకున్న విపక్షాలు మరోసారి ఆటంకపరుస్తున్నాయని మండిపడ్డారు.
భారతదేశంలో ఎన్నికల సందడి నెలకొన్న వేళ, ఓటర్లు తమ ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వివరాల్లోకి వెళితే..
జమ్మూకాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయి నేటికి సరిగ్గా ఏడాది పూర్తయ్యింది. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఉగ్రవాది (టెర్రరిస్ట్) అని సంబోధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఓ జాతీయ పార్టీ అధ్యక్షుడిగా, సుదీర్ఘ రాజకీయ అనుభవం గల నాయకుడిగా ఖర్గేకు పేరు ఉందని ప్రస్తావించారు.
రాజస్థాన్లోని బలోత్రా జిల్లా పచ్పద్రలోని ఆయిల్ రిఫైనరీని మంగళవారంనాడు తన చేతుల మీదుగా ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించాల్సి ఉండగా ఆ కార్యక్రమం తాజాగా వాయిదా పడింది. పచ్పద్రలోని క్రూడ్ డిస్టిలేషన్ యూనిట్ వద్ద సోమవారంనాడు అగ్నిప్రమాదం జరిగింది.