Home » Pakistan
పాక్ మరోసారి తన దుర్బుద్ధిని బయటపెట్టుకుంది. పాక్ విమానాలు భారత్ మీదుగా ప్రయాణించేందుకు అడిగిన వెంటనే అనుమతిచ్చినా అసత్య ప్రచారానికి తెర తీసింది. భారత్ అనుమతులను నిరాకరించిందంటూ పాక్ మీడియా వార్తలను వండివార్చింది. అయితే, భారత వర్గాలు పాక్ దుర్నీతిని ఎండగట్టాయి.
ఇమ్రాన్ ఖాన్కు హాని జరిగితే పాక్ అల్లకల్లోలంగా మారుతుందని ఆయన సోదరి నోరీన్ నియాజీ హెచ్చరించారు. పాక్ ప్రజల మద్దతు ఇమ్రాన్కు ఉందని అన్నారు. ఆయన కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారని అన్నారు.
యాంటీ-షిప్ బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్టు పాకిస్థాన్ మిలిటరీ విభాగం ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ వెల్లడించింది. ఈ ప్రయోగం విజయవంతమైందని తెలిపింది. ఈ మిసైల్ భూమిపైన, సముద్రంలోని లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదించగలదని వెల్లడించింది.
మతతత్వ రికార్డులతో మలినమైన వాళ్లకు ఇతరులకు నీతులు చెప్పే నైతికత ఎక్కడిదని పాక్ను భారత్ ప్రశ్నించింది. ముందు సొంత ఇల్లు చక్కబెట్టుకోవాలంటూ దాయాది దేశానికి హితవు పలికింది.
ఇమ్రాన్ ఖాన్కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియోలో రావడంతో పెద్ద ఎత్తున ఆయన మద్దతుదారులు జైలు బయట గుమిగూడినట్టు, ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యులను జైలులోకి అనుమతించాలని డిమాండ్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.
సింధ్ ప్రాంతంపై ఇటీవల కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై పాక్ మండిపడింది. ఈ వ్యాఖ్యలు హిందుత్వ విస్తరణా వాదాన్ని ప్రతిబింబిస్తాయన్న పాక్.. భారత్ ఇలాంటి విషయాలపై కాకుండా ఇతర అంశాలపై దృష్టిసారించాలని హితవు పలికింది.
ఆసియాకప్ 2025 ఫైనల్ లో ఘోరంగా ఓడిన పాకిస్థాన్ జట్టుకు వారి దేశానికి చెందిన పాక్-ఏ జట్టు తాజాగా ఓ ఊరటను ఇచ్చింది. ఆసియాకప్ రైజింగ్ స్టార్స్ టైటిల్ విన్నర్ గా పాకిస్థాన్ ఏ జట్టు నిలిచింది.
ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో భారతదేశంతో పూర్తి స్థాయి యుద్ధం జరిగే అవకాశాన్ని కొట్టిపారెయ్యలేమని దేశమంతా అప్రమత్తంగా ఉండాలని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మంగళవారం హెచ్చరించారు.
పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ అజమ్ కు బిగ్ షాక్ తగిలింది. శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో అతడు ప్రవర్తించిన తీరుకు ఐసీసీ అతడి ఫీజులో కోత విధించింది.
ఏసీసీ 2025 టోర్నీలో భారత్-ఏపై పాకిస్తాన్-ఏ జట్టు విజయం సాధించింది. ఇండియా నిర్దేశించిన 137 పరుగుల లక్ష్యాన్ని పాక్ 13.2 ఓవర్లలో ఛేదించింది. ఈ విజయంతో పాక్ సెమీ ఫైనల్స్కు అర్హత సాధించింది.