Home » Operation Sindoor
Venkaiah Naidu:పహల్గామ్ ఉగ్రదాడి ప్రపంచ మానవాళి చరిత్రలోనే అత్యంత దుర్మార్గమైన, హేయమైన చర్య అని భారత గౌరవ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు తెలిపారు. మతం పేరు అడిగి మరీ 26 మంది అమాయకులను కాల్చి చంపటం అత్యంత దారుణమని వెంకయ్య నాయుడు అన్నారు.
ఆపరేషన్ సిందూర్, పహల్గాం ఉగ్రదాడి గురించి వివరించేందుకు ఎంపీ కనిమొళి నేతృత్వంలోని భారత ప్రతినిధుల బృందం రష్యా చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరు మాస్కోలో ల్యాండ్ అవుతున్న సమయంలో వారికి విచిత్రమైన అనుభవం ఎదురైంది.
ఆపరేషన్ సింధూర్ విజయంలో సాయుధ బలగాలు, మోదీ నాయకత్వాన్ని అభినందిస్తూ ఒక తీర్మానాన్ని శివసేన నేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ప్రవేశపెట్టారు. ఆపరేషన్ సిందూర్తో దేశ ప్రజల్లో నైతిక స్థైర్యం, ఆత్మస్థైర్యం పెరిగిందని ఆ తీర్మానం పేర్కొంది.
పహల్గాం దాడి సందర్భంలో బాధిత మహిళలు అనుసరించాల్సిన తీరుపై బీజేపీ రాజ్యసభ ఎంపీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కేంద్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. సదరు ఎంపీపై విపక్షాలు మండిపడుతున్నాయి.
ఆపరేషన్ సిందూర్కు సంబంధించి ఒక్కొక్కటిగా నమ్మలేని నిజాలు బయటకు వస్తున్నాయి. భారత మహిళా పైలట్లు శత్రుదేశానికి చుక్కలు చూపించారని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఏకంగా 200 మందిని లేపేశారని పేర్కొన్నాయి. దీని గురించి మరింతగా చూద్దాం..
భారత రక్షణ రహస్యాలు తెలుసుకోవడానికి పాకిస్థాన్ భారత్లో పెద్ద నెట్ వర్కే నడిపినట్టు అర్థమవుతోంది. ఇటీవల ఏటీఎస్ అరెస్ట్ చేసిన గోహిల్ తాజాగా ఇచ్చిన సమాచారం ప్రకారం భారతదేశంపై పాక్ కుటిల యత్నాలు మరిన్ని బయటకు వస్తున్నాయి.
ఉగ్రవాదం ముప్పును తిప్పి కొట్టేందుకు భారత్ స్వీయ రక్షణ హక్కు ఉందని జర్మనీ స్పష్టం చేసింది. పహల్గాం దాడిని ఖండించింది.
Mysore Pak: రాజస్థాన్, జైపూర్లో త్యోహార్ స్వీట్స్ అనే స్వీట్ షాపు ఉంది. భారత్ పాక్ గొడవల నేపథ్యంలో ఈ స్వీట్ షాపు యజమానులు ఓ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. మైసూర్ పాక్లో పాక్ అని ఉండటం వారికి నచ్చలేదు.
ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) ద్వారా పాకిస్థాన్కు గట్టి సమాధానం ఇచ్చామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) అన్నారు. ఇలా పాకిస్థాన్ అనేక దాడులను భారత్ తిప్పికొట్టినట్లు గుర్తుచేశారు షా. బీఎస్ఎఫ్ 22వ పదవీ పురస్కార కార్యక్రమానికి ఢిల్లీలో హాజరైన క్రమంలో ఈ మేరకు పేర్కొన్నారు.
ఆపరేషన్ సిందూర్తో పాకిస్థాన్కు మూడు చెరువుల నీళ్లు తాగించిన భారత్.. అంతర్జాతీయంగానూ శత్రుదేశాన్ని ఏకాకిని చేయాలని చూస్తోంది. ఇందులో భాగంగానే దౌత్య యుద్ధాన్ని షురూ చేసింది. పాకిస్థాన్ దుశ్చర్యలను ఎండగట్టేందుకు అఖిలపక్ష బృందాలను విదేశాలకు పంపించింది.