Home » Ongole
ఆంధ్రప్రదేశ్: వైసీపీ ప్రభుత్వంలో కూటమి నేతల ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంపై ఒంగోలు పోలీసులు విచారణ కొనసాగుతోంది. రూరల్ పోలీస్ స్టేషన్లో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను న్యాయవాది సమక్షంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
వివాదాస్పద సినీ దర్శకుడు రామ్గోపాల్వర్మ శుక్రవారం ఒంగోలు రూరల్ పోలీసు స్టేషన్లో జరిగే విచారణకు హాజరుకానున్నారు. ఒంగోలు రూరల్ సర్కిల్ కార్యాలయంలో విచారణ జరగనుంది. అందుకు సంబంధించి పోలీసులు పటిష్ఠంగా భద్రత ఏర్పాట్లు చేశారు.
MP Magunta Srinivasulu Reddy: ఒంగోలు తెలుగుదేశం పార్టీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అస్వస్థతతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఆయనకు చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఆయన ఓ వీడియో విడుదల చేశారు. అభిమానులు, పార్టీలనేతలకు ఈ సమాచారం తెలిపారు. ఎవరూ ఆందోళన చెందవద్దని అన్నారు.
కానీ ఒక ఆవు రూ. 41 కోట్లు ధర పలికితే.. అమ్మో అని నోరెళ్లబెట్టాల్సిందే. ఇటీవల బ్రెజిల్లో జరిగిన వేలంలో వియాటినా-19 అనే పేరు గల ఆవు 4.8 మిలియన్ డాలర్లు
రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడు తులసిబాబును ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ సోమవారం రాత్రి విచారించారు. ప్రధానంగా మాజీ సీఐడి చీఫ్ సునీల్ కుమార్తో ఉన్న సంబంధాలపై ఆరా తీశారు. అయితే సమయం ఎక్కవగా లేకపోవడంతో గంటన్నర మాత్రమే విచారించారు. తిరిగి మంగళవారం ఉదయం విచారణ కొనసాగనుంది.
తులసిబాబు పోలీస్ కస్టడీ ముగిసిన తర్వాత ఆయన బెయిల్ పిటిషన్పై విచారణ జరపాలని ప్రాసిక్యూషన్ హైకోర్టును కోరింది.
నాటి ఎంపీ, ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడు కామేపల్లి తులసి బాబును గుంటూరు కోర్టు మూడు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. దీంతో సోమవారం నుంచి ఎస్పీ దామోదర్ ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో తులసి బాబును విచారించనున్నారు.
సీఐడీ మాజీ చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్కుమార్తో నీకున్న సంబంధం ఏమిటి.. ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా అని ‘ప్రైవేటు వ్యక్తి’ తులసిబాబును విచారణాధికారి, ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ప్రశ్నించినట్లు తెలిసింది.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కామేపల్లి తులసి బాబు రెచ్చిపోయారు. ఈ కేసులో విచారణ నిమిత్తం ప్రకాశం జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చిన తులసి బాబు, అతని అనుచరులు ఓవరాక్షన్ చేశారు.
ప్రకాశం జిల్లా: ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో కామేపల్లి తులసి బాబును ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ విచారించనున్నారు. రఘురామ కృష్ణంరాజు గుండెలపై కూర్చొని టార్చర్ చేశాడని తులసి బాబుపై ఆరోపణలు ఉన్నాయి.