• Home » Ongole

Ongole

YCP: ఏపీలో బాలినేని వర్గం దౌర్జన్యకాండ

YCP: ఏపీలో బాలినేని వర్గం దౌర్జన్యకాండ

ఒంగోలులో వైసీపీ (YSRCP) రౌడీ రాజకీయం శ్రుతిమించింది. బుధవారం నగరంలో టీడీపీ నాయకులతోపాటు, సామాన్యులపైనా దాడి చేసి, బీభత్సం చేసిన ఆ పార్టీ నేతలు.. తిరిగి తెలుగుదేశం వారిపైనే అట్రాసిటీ కేసులు పెట్టారు. దీనికి పోలీసులు కూడా వత్తాసు పలుకుతూ వారు ఫిర్యాదిచ్చిందే తడవుగా కేసు నమోదు చేయడం విమర్శలకు తావిస్తోంది.

YSRCP Vs TDP: బరితెగించిన బాలినేని వర్గం!

YSRCP Vs TDP: బరితెగించిన బాలినేని వర్గం!

AP Elections: ఒంగోలులో వైసీపీ నాయకులు అరాచకం సృష్టించారు. ఇంటింటి ప్రచారానికి వెళ్లిన వైసీపీ నేతలతో వలంటీర్‌ ఉండటాన్ని ప్రశ్నించిన సామాన్య కుటుంబంపై దాడికి పాల్పడ్డారు. ఈ విషయమై ప్రశ్నించిన స్థానిక టీడీపీ నాయకుడు మేడికొండ మోహన్‌రావుపైనా, మరికొందరిపైనా దాడి చేశారు. రక్తపుమడుగులో కిందపడిపోయిన మోహన్‌రావును విచక్షణారహితంగా కొట్టారు. పోలీసులు సైతం ప్రేక్షకపాత్ర వహించడంతో మూడుగంటలపాటు అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది...

AP Politics: రెండ్రోజుల్లో టీడీపీలోకి వైసీపీ ఎంపీ..

AP Politics: రెండ్రోజుల్లో టీడీపీలోకి వైసీపీ ఎంపీ..

Andhrapradesh: టీడీపీలో చేరేందుకు తమ కుటుంబం సంసిద్ధంగా ఉందని వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ప్రకటించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మా అబ్బాయి రాఘవరెడ్డితో కలిసి టీడీపీలో చేరుతాను. ఏ రోజు టీడీపీలో చేరాలో చంద్రబాబు నిర్ణయిస్తారు. మాగుంట రాఘవరెడ్డి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరాను. మాగుంట రాఘవరెడ్డిని ఆశీర్వదించాలని ప్రజల్ని కోరుకుంటున్నాను’’ అని వెల్లడించారు.

AP Politics: టీడీపీ నేతలకు ఎంపీ మాగుంట అల్పాహార విందు...

AP Politics: టీడీపీ నేతలకు ఎంపీ మాగుంట అల్పాహార విందు...

Andhrapradesh: ఒంగోలులో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని టీడీపీ నేతలు కలిశారు. సోమవారం ఉదయం ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని టీడీపీ నేతలను అల్పాహార విందుకు ఎంపీ ఆహ్వానించారు. ఈ క్రమంలో మాగుంట ఇంట్లో మాజీ ఎమ్మెల్యేలు దామచర్ల జనార్ధన్, బిఎన్ విజయ్ కుమార్, అశోక్ రెడ్డి, ఎర్రగొండపాలెం ఇన్ ఛార్జ్ ఎరిక్షన్ బాబు, దర్శి ఇన్ ఛార్జ్ రవికుమార్ భేటీ ఆయ్యారు.

Siddham: జగన్‌.. గ్రాఫిక్స్‌ ‘షో’

Siddham: జగన్‌.. గ్రాఫిక్స్‌ ‘షో’

YS Jagan Siddham Sabha: కొన్ని సినిమాలు చూస్తుంటే ఆ దృశ్యాలు నిజంగా ఉన్నట్టుగానే కనిపిస్తాయి కానీ అవన్నీ కల్పితం. గ్రాఫిక్స్‌ మాయాజాలంతో లేనివి ఉన్నట్టుగా చిత్రీకరించినవి. అచ్చం వైసీపీ ఇలాగే జనం చెవిలో పూలు పెట్టేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయింది. లేని గొప్పలకు పోయి నవ్వులపాలైంది..

YS Jagan: నిష్క్రమణకు సిద్ధమా?

YS Jagan: నిష్క్రమణకు సిద్ధమా?

YS Jagan Siddham Sabha: మూడు దశాబ్దాలు రాష్ట్రాన్ని ఏలుతానని ప్రకటించుకున్న సీఎం జగన్మోహన్‌రెడ్డికి ఈ ముచ్చట ఐదేళ్లకే ముగియనుందని అర్థమైపోయిందా..? పదవి పోతుందని ముందుగానే మానసికంగా సిద్ధమయ్యారా..? బాపట్ల జిల్లా మేదరమెట్ల ‘సిద్ధం’ సభలో ఆయన ప్రసంగం జనానికి వీడ్కోలు పలుకుతున్నట్లుగా ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి...

YCP:  ప్రకాశం జిల్లాలో వైసీపీకి షాక్

YCP: ప్రకాశం జిల్లాలో వైసీపీకి షాక్

ప్రకాశం: జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాజీనామా చేయనున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం ఆయన ఒంగోలులో మీడియాతో మాట్లాడుతూ మాగుంట కుటుంబానికి ప్రకాశం జిల్లా రాజకీయ జన్మనిచ్చిందన్నారు.

YSRCP: మాగుంటను వెంటాడిన వైఎస్ జగన్‌.. చివరి యత్నంగా ఇలా..?

YSRCP: మాగుంటను వెంటాడిన వైఎస్ జగన్‌.. చివరి యత్నంగా ఇలా..?

AP Elections 2024: కష్టాల్లో ఉన్నప్పుడు రారమ్మని పిలిచారు. అధికారంలోకి రాగానే ఎదురుదాడి ప్రారంభించారు. తొలుత ఆర్థిక వనరులపై దాడి. ఆ తర్వాత ఆయన మాటచెల్లకుండా అధికారులపై ఆంక్షలు. ఇంకోవైపు కేంద్రం నుంచి అభివృద్ధి పనులకు నిధులు తెస్తే రాష్ట్రా వాటా నిధులివ్వకుండా అడ్డుకోవడం. ఎదురువెళ్లి నమస్కరించినా అగౌరవపరిచి పొమ్మనకుండా పొగబెట్టడం. తాజాగా సోషల్‌ మీడియాలో పాపమంతా బీజేపీదే అన్న అసత్య ప్రచారాలకు దిగడం.

YS Jagan: పేదల సాక్షిగా పచ్చి అబద్ధాలు!

YS Jagan: పేదల సాక్షిగా పచ్చి అబద్ధాలు!

పేదల సాక్షిగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అలవోకగా పచ్చి అబద్ధాలను చెప్పారు. ఒంగోలులో నివాస స్థల పట్టాల పంపిణీపై హైకోర్టులో వైసీపీ నేత పిల్‌ వేయగా, చంద్రబాబే కోర్టుకు వెళ్లినట్లుగా జనాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు.

CM Jagan: అక్కచెల్లెమ్మలను మిలీనియర్లుగా చేస్తున్నాం.. 20 లక్షల ఇళ్లు నిర్మించాం..

CM Jagan: అక్కచెల్లెమ్మలను మిలీనియర్లుగా చేస్తున్నాం.. 20 లక్షల ఇళ్లు నిర్మించాం..

రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ఇంటింటికీ అందించామని సీఎం జగన్ వెల్లడించారు. నేడు ఆయన ఒంగోలు బహిరంగ సభలో మాట్లాడుతూ.. గతంలో అందని నామినేటెడ్ పదవుల్ని చట్టం చేసి 50 శాతం పేదల చేతుల్లో పెట్టామన్నారు. ఎమ్మెల్యేలకు, ఐఎఎస్ అధికారులకు ఇచ్చే నిబంధనల ప్రకారమే పేదలకు ఇళ్ళ పట్టాలు ఇస్తున్నామని పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి